CM Vijay: గత ఏడాది తమిళనాడు ఎన్నికల ప్రచారం లో భాగంగా సీఎం విజయ్ కరూర్ ప్రాంతం లో నిర్వహించిన సభ లో తొక్కిసలాట జరిగి ఎంతో మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం లో అప్పటి ప్రభుత్వం విజయ్ ని దోషిగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ వాస్తవాలు తెలిసిన జనాలు వాటిని నమ్మలేదు. ఆ తర్వాత విజయ్ చనిపోయిన ప్రతీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మాట ఇచ్చారు. అంతే కాకుండా తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత , చనిపోయిన ప్రతీ కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు. ఇక సీఎం అయ్యాక మొదటి సార్ కరూర్ ప్రాంతం లో పర్యటించిన విజయ్ , చాలా భావోద్వేగ పూరిత ప్రసంగాన్ని అందించారు.
ఆయన మాట్లాడుతూ ‘ ఏ మనిషి అయినా తన జీవితం లో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ కొన్ని జ్ఞాపకాలు వాళ్ళను వెంటాడుతూనే ఉంటాయి. నాకు అలాంటి జ్ఞాపాకులు ఈ కరూర్ లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన వల్ల ఏర్పడ్డాయి. ఈ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డని కోల్పోయారు.దీనికి బాద్యులు ఎవరు చెప్పండి?, ఆరోజు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి , మాకు ముందస్తు సమాచారం అందించి అలెర్ట్ చెయ్యాల్సింది. లేదా సమావేశాన్ని ఆరోజు రద్దు చేయాల్సింది. వారి చేతిలోని పనే కదా, కానీ అవేమి చేయకుండా వారు తాపీగా చోద్యం చూస్తూ టైం పాస్ చేశారు. ఆరోజు ఉన్న జనాలను పోలీసులు కంట్రోల్ చేయగలరని నేను నమ్మాను.కానీ , నా వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందంటూ నిందలు వేశారు. ఘటన తర్వాత నేను అక్కడి నుండి పారిపోయానని ప్రత్యర్థులు నాపై విమర్శలు చేశారు. కానీ నేను పారిపోలేదు , ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వాచా, ఈరోజు మీ ముందు ఇలా నిల్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు విజయ్.
అంతే కాకుండా ఇటీవల తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రల గురించి మాట్లాడుతూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. జనాలు తనవైపే ఉన్నారని , ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన ప్రజల చేత ఎంచుకోబడిన ఈ ప్రభుత్వాన్ని కూల్చేయలేరని ఆయన డీఎంకే పార్టీ పై మండిపడ్డారు. తన హయాం లో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరిగితే అసలు సహించను అని, ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు విజయ్. ఎన్నికలకు ముందు చనిపోయిన కుటుంబాలకు విజయ్ ఇచ్చిన హామీ ని నెరవేరుస్తూ , నేడు కరూర్ లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ , నియామక పత్రాలు అందించారు సీఎం విజయ్.
