Chiranjeevi: చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. తన లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం. ఇక ఏది ఏమైనా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవికి భారీ సక్సెసు లైతే రాలేకపోతున్నాయి. కారణం ఏంటి అంటే ఆయనలోని పూర్తి స్థాయి నటుడిని వాడుకునే దర్శకుడు అతనికి దొరకడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు… ఇప్పటికే చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లకు సీనియర్ డైరెక్టర్లకు సైతం అవకాశాలను ఇస్తున్నాడు. కానీ పూరీ జగన్నాధ్ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చే క్రమంలో 150 సినిమాలు చేయడానికి పూరి జగన్నాధ్ చాలా వరకు సన్నాహాలు చేశాడు.
కానీ చిరంజీవి అతన్ని రిజెక్ట్ చేశాడు. దానికి తోడుగా రీమేక్ సినిమాను నమ్ముకొని వివి వినాయక్ కి అవకాశాన్ని ఇచ్చాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించినప్పటికి చిరంజీవి నటనలోని వేరియేషన్స్ ను ఈ సినిమాలో చూపించలేకపోయింది… ఇక ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మరో ఇద్దరు కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడప్పుడే పూరి తో సినిమాలు చేసే అవకాశామైతే లేనట్టుగా తెలుస్తుంది… పూరి సైతం ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడం వల్ల చిరంజీవి అతనికి సినిమా ఇవ్వడం లేదని మరోసారి అతను సక్సెస్ లను సాధించి లైమ్ లైట్ లోకి వస్తే తప్పకుండా అతనికి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…
