Homeఆంధ్రప్రదేశ్‌జగన్‌.. మౌనమేలనోయి..!

జగన్‌.. మౌనమేలనోయి..!

AP CM Jagan Silence Politics‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌లు ఎవరి మాట వినని ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలకు పరిస్థితులు అనుకూలించడంతో పనులు చకచకా సాగుతున్నాయి. అయితే ఆంధ్ర సీఎం జగన్‌కు మాత్రం కొన్ని అనుకూలించడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

కొన్ని ప్రాధాన్యత సంతరించుకున్న విషయాల్లో జగన్‌ పూర్తిగా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆసలేం జరగుతోంది..? అన్న ఆలోచనలో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతీ విషయాన్ని జగన్‌ నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇతరుల చేత చెప్పించడంతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందా..? అన్న సందేహం కలుగుతుంది.

Also Read: రాయలసీమకు కేంద్రం అన్యాయం.. జగన్ ఏం చేయబోతున్నాడు?

ఇటీవల పలుమార్లు ఢిల్లీ వెళ్లిన జగన్‌ ఎందుకు వెళ్లాడు..? అనే విషయంపై మీడియాలో, జనాల్లో తీవ్రంగా చర్చ సాగింది. అయితే ఏపీ సీఎం మాత్రం ఏవిధంగా స్పందించలేదు. ఇక ఇళ్లపట్టాల పంపిణీని ప్రారంభించే దశలోనే ఆ కార్యక్రమం నిలిచిపోయింది. దీనికి గల కారణాలు తెలియక జనాలు ఆగమవుతున్నారు. ఆ మధ్య ‘జగనన్న విద్యాకానుక’ అనే కార్యక్రమం కూడా ఇలా మధ్యలోనే నిలిచిపోవడంతో సంక్షేమ కార్యక్రమాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

జగన్‌ మాత్రం వెంటవెంట కొత్త కార్యక్రమాలకు ప్రారంభించుకుపోతున్నారు. అయితే అవి సక్రమంగా ప్రజల్లోకి చేరుతున్నాయా..? లేదా..? అనేది మాత్రం చూడడం లేదు. దీంతో సగటు పేదలకు ఆ ఫలాలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక పార్టీలోని నాయకులు ఎంతసేపు ప్రతిపక్షాలతో మాటల యుద్ధం చేయడం తప్ప ప్రభుత్వ పథకాలు నిలిచిపోవడంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇది మెల్లమెల్లగా జగన్‌ ప్రభుత్వంపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని సీనియర్‌ రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు.

Also Read: బాబు కాలదన్నాడు.. జగన్ అందలమెక్కించాడు!

కరోనా సమయంలో పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్‌ ఆ తరువాత వాటికి దూరంగా ఉంటున్నారు. కొందరు తనపై ఉన్న కేసుల విషయంలో జగన్‌ ఢిల్లీ వెళుతున్నారని అంటుండగా.. మంత్రులు మాత్రం పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురావడానికే పోరాడుతున్నారంటున్నారు. అయితే ఢిల్లీ వెళ్లిన తరువాత జగన్‌ ఎలాంటి ప్రెస్‌మీట్‌ పెట్టకపోవడంతో ఈ విషయంపై రకరకాలుగా అనుకుంటున్నారు. మరోవైపు అంతర్వేది ఘటనపై ఇప్పటికీ జగన్‌ స్పందించకపోవడంతో హిందుత్వవాదుల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇలా జగన్‌ ఎంతకాలం మౌనంగా ఉంటాడో తెలియక అటు పార్టీ నాయకులు, ఇటు ఆంధ్ర ప్రజలకు అర్థం కావడం లేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version