Allu Arjun Theaters : రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ నిర్మించబోతున్న అల్లుఅర్జున్

Allu Arjun Theaters : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ముందుకు దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాము..చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రోజు నుండి..నేడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం వరుకు..అల్లు అర్జున్ సినీ జర్నీ యువతకి ఎంతో ఆదర్శప్రాయం..పుష్ప సినిమా తో తన క్రేజ్ ని ఖండాలు దాటగా , ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు […]

Written By: NARESH, Updated On : December 8, 2022 9:57 pm
Follow us on

Allu Arjun Theaters : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ముందుకు దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాము..చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రోజు నుండి..నేడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం వరుకు..అల్లు అర్జున్ సినీ జర్నీ యువతకి ఎంతో ఆదర్శప్రాయం..పుష్ప సినిమా తో తన క్రేజ్ ని ఖండాలు దాటగా , ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

అలా హీరోగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అల్లు అర్జున్..ఇప్పుడు వ్యాపారరంగం లో కూడా తన సత్తాని చూపేందుకు సిద్ధం అవుతున్నాడు..ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లోని మైత్రి వనం వద్ద ఉన్న సత్యం థియేటర్ ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే..ఈ థియేటర్ ని కొనేళ్ల క్రితమే కూల్చేశారు..అయితే ఆ కూల్చేసిన స్థలాన్ని అల్లు అర్జున్ కొనుగోలు చేసాడనే సంగతి అప్పట్లో ఎవరికీ తెలియదు.

అయితే ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక మల్టిప్లెక్స్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది..వచ్చే సంక్రాంతి నుండి ఈ మల్టిప్లెక్స్ రన్నింగ్ లోకి రానుంది..ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ మరియు తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమాలతో ఈ ముల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది..అల్లు అర్జున్ తో పాటుగా ఆసియన్ సంస్థ కూడా ఇందులో భాగస్వామి గా వ్యవహరిస్తుంది..గతం లో ఆసియన్ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నిర్మించిన ‘AMB సినిమాస్’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది..భాగ్యనగర వాసులకు ఈ మల్టిప్లెక్స్ ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది..ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా అలాంటి మల్టిప్లెక్స్ నిర్మించారు.

మైత్రీవనం వంటి బిజీ సెంటర్ లో మల్టిప్లెక్స్ ని నిర్మించడం అంటే గ్రాండ్ సక్సెస్ అయ్యినట్టే..ఎందుకంటే ఉద్యోగాలు చేసే వారిదగ్గర నుండి చదుకునే వాళ్ళ వరుకు ప్రతి ఒక్కరు సంచరించే ప్రాంతం ఇది..అలాంటి బిజీ సెంటర్ లో మల్టిప్లెక్స్ నిర్మాణం అంటే అల్లు అర్జున్ సక్సెస్ సాధించినట్టే..ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి సిటీ లోను మల్టిప్లెక్స్ నిర్మించడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.