జంప్ అయిపోతున్న హీరో గోపీచంద్

హిట్స్ లేకున్నా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న హీరో గోపీచంద్. ఈ హీరోతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన దర్శకుడు శ్రీవాస్ తాజాగా మూడో సినిమా మొదలుపెట్టాడు. గోపీచంద్-శ్రీవాస్ కలయికలో ఇప్పటికే గతంతో రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. ‘లక్ష్యం’, లౌక్యం సినిమాలను వీరు తీశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం పట్టాలెక్కింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మూడో చిత్రం పట్టాలెక్కింది. ఇది కోల్ కతా నేపథ్యంలో సినిమా తీస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : July 15, 2021 9:52 pm
Follow us on

హిట్స్ లేకున్నా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న హీరో గోపీచంద్. ఈ హీరోతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన దర్శకుడు శ్రీవాస్ తాజాగా మూడో సినిమా మొదలుపెట్టాడు. గోపీచంద్-శ్రీవాస్ కలయికలో ఇప్పటికే గతంతో రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. ‘లక్ష్యం’, లౌక్యం సినిమాలను వీరు తీశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం పట్టాలెక్కింది.

తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మూడో చిత్రం పట్టాలెక్కింది. ఇది కోల్ కతా నేపథ్యంలో సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంపై పోస్టర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

కాళీ మాతా విగ్రహంతోపాటు హౌరా వంతెనను చూపిస్తూ ఈ పోస్టర్ ను ఆసక్తికరంగా మలిచారు. చిత్రంపోస్టర్ తోనే ఆకట్టుకునేలా ఉంది.

గోపీచంద్ 30వ చిత్రం ఇది. అన్ని కమర్షియల్ హంగులు కలిగిన కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. భూపతిరాజా ఈ చిత్రానికి కథ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వివేక్ కూచిబోట్ల సహ నిర్మాత. శ్రీవాస్ దర్శకత్వంలో తీస్తున్న ఈ మూవీలో గోపీచంద్ భిన్నమైన అవతారంలో కనిపిస్తాడని చెబుతున్నారు.