గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘లౌక్యం’ . 2014లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. అంతకుముందు వాంటెడ్, మొగుడు చిత్రాలతో ఫ్లాప్లో ఉన్న గోపీ మళ్లీ హిట్ ట్రాక్లోకి వచ్చాడు. ‘లక్ష్యం’తో అతనికి తొలి కమర్షియల్ హిట్ అందించిన నివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. లవ్, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘లౌక్యం’లో గోపీ, రకుల్ జోడీ చక్కగా కుదిరింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పడింది. ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టబోతున్నారట.
గోపీ మొదటి సినిమా తొలి వలపు ఫ్లాప్ కావడంతో తాను తీసిన ‘జయం’, ‘నిజం’ చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు తేజ. ఇప్పుడు గోపీచంద్ హీరోగా ‘అలివేలుమంగ వెంటకరమణ’ పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన తేజ.. ఇప్పటికే స్క్రీప్ట్ పని కూడా పూర్తి చేశాడట. కొన్ని రోజుల నుంచి హీరోయిన్ను అన్వేషించే పనిలో ఉన్నాడు. తొలుత సాయి పల్లవిని సంప్రదిస్తే ఆమె ఒప్పుకోలేదని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కాజల్, అనుష్క పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, రకుల్ ప్రీత్ సింగ్ను తేజ ఖరారు చేసినట్టు సమాచారం. లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో ఉన్న రకుల్కు తేజ ఫోన్ ద్వారా కథ వినిపించగా.. ఆమె సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. డేట్స్ అడ్జస్ట్ అయితే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.