దేవత పాత్రలో దెయ్యం.. ఫుల్ ఎక్స్ పోజింగ్ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే.. అక్కడి ప్రజలకు దేవతతో సమానం. అలాంటి దేవత పాత్రలో దెయ్యం నటిస్తోంది అంటూ.. ఇప్పటికే కంగనా పై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఏమి చేసినా.. తనకు నచ్చినట్టు చేసుకుంటూ పోయే కంగనా.. ఈ విషయంలో కూడా అలాగే ముందుకుపోతుంది అనుకోండి. ఇక అమ్మ జయలలిత జీవితం ఆధారంగా రానున్న ఈ బయోపిక్ ను ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. […]

Written By: admin, Updated On : January 6, 2021 12:13 pm
Follow us on


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే.. అక్కడి ప్రజలకు దేవతతో సమానం. అలాంటి దేవత పాత్రలో దెయ్యం నటిస్తోంది అంటూ.. ఇప్పటికే కంగనా పై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఏమి చేసినా.. తనకు నచ్చినట్టు చేసుకుంటూ పోయే కంగనా.. ఈ విషయంలో కూడా అలాగే ముందుకుపోతుంది అనుకోండి. ఇక అమ్మ జయలలిత జీవితం ఆధారంగా రానున్న ఈ బయోపిక్ ను ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

Also Read: ‘క్రాక్’ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ – ర‌వితేజ

అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుందని.. జయలలిత పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 24వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్స్ అయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఓ వివాదం రాజుకుంది. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె చీర పట్టుకుని లాగడం కూడా ఒకటి. ఆ సన్నివేశంలోనే కంగనా మరి బోల్డ్ గా నటించందట. అసలుకే ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ చేద్దామా అని కాచుకుని ఉండే.. కంగనాకి ఆ చీర సీన్ తెగ నచ్చేసిందట.

Also Read: ‘అల్లు అర్జున్’ చెల్లిగా స్టార్ హీరోయిన్ !

అందుకే ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా తనకు నచ్చిన హాఫ్ సారీలో ఫుల్ గ్లామర్ ను గుప్పించిదట. ఇది తెలిసే తమిళ ప్రేక్షకులు దేవత పాత్రలో దెయ్యం అంటూ కంగనా పై విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే, కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందనేది నిజం, కాబట్టి కంగనా ఏమి చేసినా ప్రత్యేకమే. ఇక ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా, మరి జయలలితగా ఎలా మెప్పిస్తోందో. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్