Gabbar Singh Re Release: టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మధ్య ఒకప్పుడు పోటీ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి కి ముందు టాలీవుడ్ రికార్డ్స్ అన్ని వీళ్లిద్దరి ఖాతాల్లోనే ఉండేవి. ఆ రేంజ్ డామినేషన్ చూపించారు. అయితే ఎప్పుడూ కూడా వీళ్లిద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలు లేవు. ఒక్కసారైనా అలా జరిగితే బాగుండును అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది సాధ్యం అవ్వలేదు. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా , వీళ్లిద్దరి కెరీర్స్ లో కల్ట్ క్లాసిక్స్ గా పిలవబడే మురారి, జల్సా సినిమాలను ఒకే రోజున విడుదల చేశారు. ఈ రెండు సినిమాల్లో జల్సా చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ అంత కూడా , మురారి చిత్రానికి లేకపోవడం గమనార్హం.
ఆ రేంజ్ మార్జిన్ తో మహేష్ బాబు ని బీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి రీ రిలీజ్ సినిమాల మధ్య భారీ క్లాష్ జరగబోతుంది. ఈ నెల 26 వ తేదీన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ‘గబ్బర్ సింగ్’, మహేష్ బాబు సెన్సేషనల్ హిట్ ‘ఒక్కడు’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఇద్దరి స్టార్ హీరోల కెరీర్స్ లో ఈ రెండు సినిమాలు కూడా మైల్ స్టోన్స్ లాంటివి. ఈ చిత్రాల తర్వాత వీళ్లిద్దరి రేంజ్ మారిపోయింది. అలాంటి సినిమాలను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. దేనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది?, ఏ చిత్రానికి ఎక్కువ గ్రాస్ వస్తుంది? అంటూ సోషల్ మీడియా లో లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ రెండు సినిమాలను వివిధ సందర్భాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు.
‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని అనేక సందర్భాల్లో రీ రిలీజ్ చేశారు. చివరగా 2024 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయగా, ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండియన్ రికార్డు గా నిల్చింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి , ఒక్కటి కూడా ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు రికార్డు ని బద్దలు కొట్టలేయకపోయాయి అంటే , ఈ రీ రిలీజ్ ఎంత క్లిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా ఒక్కడు చిత్రాన్ని ఏకంగా నాలుగు సార్లు రీ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు చిత్రాలను ఆడియన్స్ ఆదరిస్తారో లేదో చూడాలి.
