మహేష్-రాజమౌళి సినిమా కథపై నిర్మాత క్లారిటీ

‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రాజమౌళి కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. టాలీవుడ్‌లో వీరిద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్ పై బోలెడు అంచనాలున్నాయి. వీరిద్దరూ కలిసి కొన్ని నెలల క్రితం కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇద్దరూ తమ తమ కొనసాగుతున్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది. ఇంతలో ఈ చిత్రాన్ని నిర్మించే శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణ దానిపై కొన్ని హాట్ […]

Written By: NARESH, Updated On : May 31, 2021 12:12 pm
Follow us on

‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రాజమౌళి కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. టాలీవుడ్‌లో వీరిద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్ పై బోలెడు అంచనాలున్నాయి. వీరిద్దరూ కలిసి కొన్ని నెలల క్రితం కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇద్దరూ తమ తమ కొనసాగుతున్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది. ఇంతలో ఈ చిత్రాన్ని నిర్మించే శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణ దానిపై కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు టాలీవుడ్ లో వైరల్ అయ్యాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ “రాజమౌలి కోరుకున్నప్పుడల్లా షూటింగ్ ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహేష్ బాబు గత రెండేళ్లుగా నాకు చెబుతున్నాడు. మహేష్ ఈ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడని.. తనని తాను సినిమా కథకు అనుగుణంగా మలుచుకోవడానికి వీలుగా తేదీల గురించి కొంచెం ముందుగానే తెలియజేయమని చెప్పాడు ” అని తెలిపారు.

ఈ సినిమా కథాంశం గురించి వస్తున్న పుకార్లపై కూడా నారాయణ ఖండించారు. “మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తలలో నిజం లేదు. ఈ చిత్రం కథ నాకు తెలియదు, ఇతరులు దాని గురించి ఎలా తెలుసుకోగలరు? ప్రస్తుతానికి, రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌పై దృష్టి సారిస్తున్నారు. అతను మా చిత్రం స్క్రిప్ట్ కోసం కూడా పనిచేస్తున్నప్పటికీ, రాజమౌళి ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన తర్వాతే మహేష్ సినిమా గురించి.. కథ గురించి వివరాలను వెల్లడించగలము ” అని తెలిపారు.

ఊహించిన ఈ ప్రాజెక్ట్ 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో విడుదలకు రెడీ అవుతుందని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారీ పాట’ కోసం పనిచేస్తున్నారు. రాజమౌలి ఆర్ఆర్ఆర్ పనులతో బిజీగా ఉన్నారు.