https://oktelugu.com/

Jabardast Edukondalu : జబర్దస్త్ చేస్తూ కోట్ల సంపాదించిన ఏడుకొండలు.. అసలు నిజం బయటపెట్టాడు!

బుల్లితెర పై కామెడీ షో జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో పేరు వింటే చాలు చాలా మంది మొఖంలో చిరు నవ్వు కనిపిస్తోంది. కారణం ఈ షో చూసి నవ్వని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.

Written By: , Updated On : February 17, 2025 / 03:09 PM IST
Jabardast Edukondalu

Jabardast Edukondalu

Follow us on

Jabardast Edukondalu : బుల్లితెర పై కామెడీ షో జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో పేరు వింటే చాలు చాలా మంది మొఖంలో చిరు నవ్వు కనిపిస్తోంది. కారణం ఈ షో చూసి నవ్వని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా జబర్దస్త్ షో స్కిట్లు వైరల్ అవుతున్నాయి. కాస్త మనసు బాగోలేకపోయినా ఆ కామెడీ స్కిట్లు చూసి రిలాక్స్ అవుతుంటారు జనాలు. జబర్దస్త్(Jabardasth) కామెడీ షో ద్వారా చాలామంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అవ్వడమే కాకుండా హీరోలు, డైరెక్టర్లుగా మారిపోయారు. ఈ షో ద్వారా అందులో చేసే కమెడియన్లు మాత్రమే ఫేమస్ కాలేదు. కామెడీ షో కి మేనేజర్ గా చేసిన ఏడుకొండలు కూడా పాపులర్ అయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి(Shyam Prasad Reddy) దగ్గర నమ్మకంగా ఉంటూ వస్తున్నారు జబర్దస్త్ ఏడుకొండలు. అయితే అలాంటి ఏడుకొండలు జబర్దస్త్ లో చేస్తూ ఎన్నో వందల కోట్లు సంపాదించారని, మణికొండలో ఏకంగా లగ్జరీ ఇల్లు కట్టుకున్నారంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

అయితే ఈ వార్తలపై ఇటీవల కాలంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏడుకొండలు (Yedukondalu) స్పష్టత ఇచ్చారు. యాంకర్ మీరు నిజంగానే జబర్దస్త్ ద్వారా కోట్లు సంపాదించి మణికొండలో ఓ భారీ బిల్డింగ్ కట్టుకున్నారా అని ప్రశ్న అడగగా.. జబర్దస్త్ ద్వారా అని కాదు కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి గారు అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నాకు కొన్ని డబ్బులు ఇచ్చి ఇల్లు కనుక్కొమని చెప్పారు. కానీ నేను నా స్తోమతకు మించి ఇల్లు కొనుక్కున్నాను. దాంతో ఆ ఇంటి కోసం తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేక, చివరికి అదే ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది. నేను ఇంటి నుండి ఎలా అయితే వచ్చానో ప్రస్తుతం అలాగే నిజాయితీగా ఉన్నాను తప్ప కోట్లు సంపాదించలేదన్నారు.

ఇక మణికొండలో బిల్డింగులు కట్టానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక స్టేజ్ మీద నాపై సెటైర్లు కూడా కేవలం కామెడీ కోసం మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే జబర్దస్త్ షో యూనిట్ మొత్తాన్ని మేనేజర్ గా చేసిన ఏడుకొండలే చూసుకునే వారు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా సినిమాల్లో చాలామంది హీరోల దగ్గర ఏడుకొండలు పని చేశారు. కృష్ణ, మహేష్ బాబు, మోహన్ బాబు, శోభన్ బాబు వంటి ఎంతోమంది హీరోల దగ్గర పని చేశానని, నాకు కృష్ణ(Krishna) తర్వాత శోభన్ బాబు అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఏడుకొండలు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జబర్దస్త్ ద్వారా కోట్లు వెనకేసుకున్నాడని, లగ్జరీ ఇల్లు, కార్లు కొనుగోలు చేశాడంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

ఆయన ఇదే ఇంటర్వ్యూలో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. “శ్యాం ప్రసాద్ రెడ్డి దగ్గర మేనేజర్ గా పనిచేయడం మానేసిన తర్వాత ఐదేళ్లు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో సొంతంగా షోలు చేయాలని.. కాన్సెప్ట్ పట్టుకుని కొంతమంది దగ్గరకు వెళితే.. నన్ను మోసం చేసి ఆ కాన్సెప్టును వేరేగా మార్చి షోలు చేశారు. పైగా నేను మోసం చేయడం వల్లే జబర్దస్త్ నుంచి నన్ను తీసేశాంటూ ప్రచారం చేయడంతో డిప్రెషన్ కు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఏదైనా బతికి నిరూపించుకోవాలని ఇప్పుడు మళ్లీ ఈ స్టేజ్ కి వచ్చాను ” అని తెలిపారు.