Drishyam 3 OTT Release: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై , సూపర్ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం 3’. మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ ‘దృశ్యం’ సిరీస్ కి మొదటి నుండి ఉన్నటువంటి విపరీతమైన క్రేజ్ కారణంగా , ఈ సినిమాకు కలెక్షన్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ‘దృశ్యం’ సిరీస్ ని కొనసాగిస్తామని ఆ చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది.
నాలుగు వారాల థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీ లో స్ట్రీమ్ చేసుకోవాలి అనే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి , ఈ చిత్రాన్ని నిన్న అర్థ రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ చిత్రం కేవలం మలయాళం , తమిళం మరియు కన్నడ వెర్షన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు లో మాత్రం విడుదల అవ్వలేదు. అందుకు కారణం రీమేక్ రైట్స్ డైరెక్టర్ ప్రియా మరియు రాజ్ కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కొనుగోలు చేయడం వల్లే. వీళ్ళు రీసెంట్ గా హై కోర్టు కి వెళ్లి , తమ వద్ద తెలుగు వెర్షన్ రీమేక్ రైట్స్ ఉన్నాయని , దయచేసి ఈ చిత్రాన్ని ఓటీటీ లో తెలుగు వెర్షన్ రిలీజ్ ని ఆపాలంటూ పిటీషన్ వేశారు. దీని పై విచారణ చేపట్టిన హైకోర్టు , తెలుగు వెర్షన్ విడుదలని ఆపుతూ నోటీసులు ఇచ్చింది.
ఆ కారణం చేతనే , ఈ చిత్రం కేవలం 3 భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ కి కూడా ఇదే సమస్య. అక్కడ ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. ఆ కారణం చేత ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో లేదు. ఇది తెలుగు , హిందీ భాషల్లోని దృశ్యం సిరీస్ అభిమానులకు తీవ్రమైన నిరాశే అని చెప్పొచ్చు. తెలుగు వెర్షన్ లో ఇప్పటికే వెంకటేష్ దృశ్యం రెండు భాగాలను చేశాడు . కానీ మూడవ భాగం లో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు. మరి నిర్మాతలు ఈ సమస్య కు చెక్ పెట్టి ఓటీటీ లో తెలుగు వెర్షన్ విడుదలయ్యేలా చేస్తారా లెదా అనేది చూడాలి.
