Drishyam 3 First Review: క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం’. ఇండియన్ ఫైన్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇలాంటి క్రైమ్ థ్రిల్లింగ్ జానర్ మూవీ గతంలో ఎప్పుడూ రాలేదు. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఈ చిత్రం ఇచ్చిన అనుభూతి వేరే లెవెల్. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ , తమిళం లో కమల్ హాసన్ , హిందీ లో అజయ్ దేవగన్ వంటి సూపర్ స్టార్స్ రీమేక్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత సీక్వెల్స్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘దృశ్యం 3’ తెరకెక్కింది. ఒక్క హిందీ లో మినహా, మిగిలిన అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం ఈ నెల 21 న విడుదల కాబోతుంది.
తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో చేద్దామని అనుకున్నారు కానీ , ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో , మలయాళం వెర్షన్ ని తెలుగు లో దబ్ చేసి విడుదల చేయబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ని కొన్ని థియేటర్స్ లో ప్రారంభించగా , అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి 24 గంటల్లో ఈ చిత్రానికి 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రివ్యూ షో ని నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారు , ఈ ప్రివ్యూ షో కి కొంతమంది సీనియర్ మీడియా రిపోర్టర్స్ కూడా హాజరయ్యారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గానే మొదలు అవుతుందని , కానీ స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతుందని , ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని , ఇలాంటి స్క్రీన్ ప్లే తో ఈమధ్య కాలం లో ఒక్క సినిమా కూడా రాలేదని అంటున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆ రేంజ్ లో ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం నుండి సినిమా ముగిసేవరకు ప్రతీ అంశం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని , ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో వచ్చే ట్విస్టులకు ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యేంత పని చేస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే , మరో వారం రోజులు ఆగాల్సిందే.