Childhood Photo: తన ఫొటో చూసుకొని సిగ్గుపడుతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి..

అలా ‘ధూంధాం’ అనే తమిళ సినిమాలో కంగనా రానౌత్ పక్కన చిన్న పాత్రలో మొదటిసారి కనిపించింది సాయిపల్లవి. ఆ తరువాత ‘కస్తూరి మాన్’ అనే మూవీలో మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా అలరించింది. అయితే వైద్య విద్య పూర్తి చేసిన తరువాత తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెకు ‘ప్రేమమ్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. దీంతో శేఖర్ కమ్ముల ‘ఫిదా ’ సినిమా కోసం సాయిపల్లవిని ఎంపిక చేశాడు.

Written By: Chai Muchhata, Updated On : July 18, 2023 9:35 am

Childhood Photo

Follow us on

Childhood Photo: ఇక్కడున్న పాపను చూశారా.. చిన్నప్పుడే చీర కట్టుకొని అలరిస్తుంది. వయసు చిన్నదైనా పెద్దమనిషిలా ఎంతో హుందగా కనిపిస్తోంది. ఈ ఫొటోను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. కానీ తన ఫొటోను చూసి తానే సిగ్గుపడుతున్న పక్కనున్న ఆమె ఓ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఈమె నటన చూసి హీరోలే షాక్ అవుతున్నారు. ఇక ఆమె డ్యాన్స్ చేస్తే వెండితెర షేక్ అవుతుంది. ఇప్పటికైనా ఆమె ఎవరో తెలిసిందా? అయితే కిందికి వెళ్లండి..

చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు చేపడున్న అమ్మాయిలా కనిపిస్తున్న ఆమె ఎవరో కాదు సాయి పల్లవి. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే గ్రామంలో జన్మించారు. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. దీంతో ఆమె పేరులో సాయిని చేర్చారు. కోయంబత్తూర్ లో పాఠశాల విద్యపూర్తి చేసిన ఈమె ఆ తరువాత జార్జియా కళాశాలలో డాక్టర్ కోర్స్ చేశారు. చిన్నప్పటి నుంచే సాయి పల్లవికి కళలంటే ఇష్టం. ఈ నేపథ్యంలో ఆమె నర్తకిగా మారారు. ఏమాత్రం బెరుకు లేకుండా స్టేజీమీద డ్యాన్స్ చేయడం చూసి చాలా మంది సినిమాల్లో నటించాలని సలహా ఇచ్చారు.

అలా ‘ధూంధాం’ అనే తమిళ సినిమాలో కంగనా రానౌత్ పక్కన చిన్న పాత్రలో మొదటిసారి కనిపించింది సాయిపల్లవి. ఆ తరువాత ‘కస్తూరి మాన్’ అనే మూవీలో మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా అలరించింది. అయితే వైద్య విద్య పూర్తి చేసిన తరువాత తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెకు ‘ప్రేమమ్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. దీంతో శేఖర్ కమ్ముల ‘ఫిదా ’ సినిమా కోసం సాయిపల్లవిని ఎంపిక చేశాడు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు ఎదురులేకుండా పోయింది. తెలుగులో ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో అలరించింది. ఆమె తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయినా ఇక్కడా సక్సెస్ కావడంతో సాయి పల్లవికి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. ఇటీవలే సాయి పల్లవి తల్లిదండ్రులతో కలసి అమర్ నాథ్ యాత్ర కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాతో ఆ విషయాన్ని చెప్పారు. ఇదే సమయంలో తన చిన్ననాటి ఫొటో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది.