Upasana – Lakshmi Pranathi : నిండు గర్భవతి ఉపాసనకు ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

సున్నుండలు, డ్రైఫ్రూట్స్ లడ్డులు ఇచ్చారట. లక్ష్మీ ప్రణతి గిఫ్ట్ కి ఉపాసన చాలా సంతోషంగా ఫీల్ అయ్యారట. తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారట

Written By: Shiva, Updated On : April 30, 2023 1:24 pm
Follow us on

Upasana – Lakshmi Pranathi : రామ్ చరణ్ వైఫ్ ఉపాసన నిండు గర్భవతి. ఆమెకు ఏడో నెల అని సమాచారం. ఉపాసన పదేళ్ల తర్వాత మొదటిసారి తల్లి అయ్యారు. దీంతో వేడుకలు ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు.  ఉపాసన సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ సెలబ్స్ కొరకు మరో వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ సతీమణి ఉపాసన హాజరైనట్లు సమాచారం. లక్ష్మీ ప్రణతికి ఉపాసన బెస్ట్ ఫ్రెండ్. చరణ్, ఎన్టీఆర్ మిత్రులు కాగా వీరి మధ్య కూడా స్నేహం కుదిరింది. అప్పుడప్పుడు ఫ్యామిలీ మీట్స్ లో పాల్గొంటారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. 

తన బెస్ట్ ఫ్రెండ్ గర్భం దాల్చిన నేపథ్యంలో ఉపాసన స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారట. ఇవి అంత విలువైనవి కాకపోయినా ఉపాసనకు ఎంతో ఇష్టమైనవట. రెండు స్పెషల్ స్వీట్స్ ఉపాసనకు లక్ష్మీ ప్రణతి గిఫ్ట్ గా ఇచ్చారట. సున్నుండలు, డ్రైఫ్రూట్స్ లడ్డులు ఇచ్చారట. లక్ష్మీ ప్రణతి గిఫ్ట్ కి ఉపాసన చాలా సంతోషంగా ఫీల్ అయ్యారట. తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారట. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే లక్ష్మీ ప్రణతి ఇచ్చిన లడ్లు, సున్నుండలు గర్భవతులకు బలవర్దకమైన ఆహారం అట. అందుకే లక్ష్మీ ప్రణతి అవి బహుమతిగా ఇచ్చారట. 
 
కాగా జులై నెలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఉపాసనకు పుట్టేది అమ్మాయే అంటూ ఓ ప్రచారం కూడా జరుగుతుంది. రామ్ చరణ్, ఉపాసన రీసెంట్ ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్, సీమంతం వేడుకలో ధరించిన డ్రెస్ కలర్ ఆధారంగా కొందరు అంచనా వేస్తున్నారు. అమెరికా వెళ్లిన ఉపాసన తనకు పుట్టబోయేది అమ్మాయే అని తెలుసుకున్నారని ఓ వాదన తెరపైకి వచ్చింది. మెగా అభిమానులు మాత్రం అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నారు. 
 
ఇక ఉపాసన డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ షూటింగ్స్ బంద్ చేశారట. ఈ కీలక సమయంలో ఉపాసన పక్కనే రామ్ చరణ్ ఉండాలని కోరుకుంటున్నారట. మరో ఐదారు నెలలు రామ్ చరణ్ ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ పొలిటికల్ థ్రిల్లర్ విడుదల కానుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు.