IPL 2023 – Preity Zinta : పంజాబ్‌ క్రికెటర్లకు స్వయంగా పరాట చేసి పెట్టిన ఓనర్ ప్రీతిజింటా!

ఇర్ఫాన్‌ పఠాన్‌ ఒక్కడే 20 పరాఠాలు తిన్నాడు’ అని చెప్పడంతో నవ్వులు పూశాయి. సాధారణంగా ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు పరాటాలు తింటారు

Written By: Raj Shekar, Updated On : April 30, 2023 1:13 pm
Follow us on

IPL 2023 – Preity Zinta : ఐపీఎల్‌ సీజన్‌ 16లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రతీ మ్యాచ్‌ రంజుగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులు ఎంజాయ్‌ చేస్తున్నారు. చివరి బంతి వరకూ విజయం రెండు జట్ల మధ్య ఊగిసలాడుతోంది. లాస్ట్‌ బాల్‌కు కూడా గెలుపు మారిపోయిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. సూపర్‌ ఓవర్‌ మాత్రం ఈ సీజన్‌లో ఇంకా వేయలేదు. ఇక అభిమానులతోపాటు ఫ్రాంచైజీల యజమానులు కూడా మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేస్తున్నారు. గెలుపోటములను అటుంచి ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఆటగాళ్లతో కలివిడిగా ఉంటూ ఉత్సాహపరస్తున్నారు. మెరుగైన ప్రదర్శన చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో సరదా సంఘటనలు చోటు చేసుకోవడం సహజం. అలాంటి ఓ సంఘటనను పంజాయ్‌ జట్టు యజమానురాలు ప్రీతిజింటా గుర్తు చేసుకుంది.
120 ఆలు పరాటాలు..
బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలోని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌లో తన జట్టును ప్రోత్సహించే ఆమె గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. 2009 సీజన్‌లో పంజాబ్‌ క్రికెటర్ల కోసం 120కిపైగా ఆలూ పరాటాలను చేసినట్లు తెలిపింది. ‘ప్రీతి జింటా తన జట్టు సభ్యుల కోసం పరాటాలు చేస్తుందని ఎవరు ఊహించగలరు? అయితే, అప్పటి నుంచి ఆలూ పరాఠాలు తినడం ఆపేసి ఉంటారు’ అని ప్రీతి జింటాను స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్‌ యాంకర్‌ సరదాగా అడిగారు. ‘అబ్బాయిలు ఎంత తింటారనే విషయం మొదటిసారి అప్పుడే నాకు తెలిసింది. మేం దక్షిణాఫ్రికాలో టోర్నీ జరిగినప్పుడు.. అక్కడంతా వారికి మంచి పరాఠాలను పెడుతున్నట్లు అనిపించలేదు. వెంటనే నేను చెఫ్‌ల వద్దకు వెళ్లి ‘మీకు పరాటా ఎలా చేయాలో నేర్పుతా’ అని చెప్పా. అది చూసిన ఆటగాళ్లు అన్ని రకాల పరాటాలు చేయడం వచ్చా అని నన్ను అడిగారు. అప్పుడు, వచ్చే మ్యాచ్‌లో మీరు గెలిస్తే ఆలూ పరాఠాలు చేసి పెడతానని చెప్పా. వారు విజయం సాధించారు. దీంతో పంజాబ్‌ క్రికెటర్ల కోసం 120 పరాఠాలను తయారు చేశా. ఇక అప్పటి నుంచి ఆలూ పరాఠాలు చేయడం ఆపేశా’ అని ప్రీతి జింటా సమాధానం ఇచ్చింది.
పటాన్‌ ఒక్కడే 20 పరాటాలు.. 
ప్రీతి సమాధానం విని పక్కనే ఉన్న హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘ఇర్ఫాన్‌ పఠాన్‌ ఒక్కడే 20 పరాఠాలు తిన్నాడు’ అని చెప్పడంతో నవ్వులు పూశాయి. సాధారణంగా ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు పరాటాలు తింటాడు. కానీ పఠాన్‌ గట్టిగా లాగించేశాడు అన్నాడు. మొత్తంగా ప్రీతీ జింటా పరోటాలు చేయడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.