Samantha Dress: సమంత వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు అంతా..? చూస్తే అంత సింపుల్ గా ఉంది!

హీరోయిన్స్, సెలబ్రిటీలు వేసిన డ్రెస్ మరలా వేయరు. ఎప్పటికప్పుడు మార్చేస్తారు. సెలబ్రిటీగా ఉండటం చిన్న విషయం కాదు. మైంటైసెన్సె కి లక్షల్లో ఖర్చవుతుంది. ట్రిప్ ముగిశాక సమంత అమెరికా వెళతారట. అక్కడ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి చికిత్స కోసమే ఆమె అమెరికా వెళ్లనున్నారని వినికిడి.

Written By: Shiva, Updated On : జూలై 26, 2023 3:22 సా.

Samantha Dress

Follow us on

Samantha Dress: హీరోయిన్ సమంత బ్రేక్ లో ఉన్నారు. ఇటీవల సమంత లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. విరామం దొరికిన నేపథ్యంలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. విహారాలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తున్నారు. మిత్రులు, సన్నిహితులతో ఇండోనేషియా వెళ్లిన సమంత బాలీ ద్వీపంలో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. దీవుల దేశంలో ప్రకృతి మధ్య గడుపుతున్నారు. ఏడాది పాటు సమంత సినిమాలు చేయరంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయాన్ని ఆమె చికిత్స కోసం, విశ్రాంతి కొరకు ఉపయోగించనున్నారట.

కాగా బాలీ ద్వీపంలోని తన విహారానికి సంబంధించిన ఫోటోలు సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఓ వీడియోలో సమంత గ్రీన్ కలర్ డిజైనర్ వేర్ ధరించారు. ఆమె ధరించి ఆ డ్రెస్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. దాని ధర ఎంతని వాకబు చేశారు. ఆ ఖరీదు చూసి అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఆ డ్రెస్ ధర రూ. 37790 అట. ఒక్కరోజు వేసుకుని పడేసే డ్రెస్ కి అన్ని వేలు ఖర్చు చేసిందా అని వాపోతున్నారు.

హీరోయిన్స్, సెలబ్రిటీలు వేసిన డ్రెస్ మరలా వేయరు. ఎప్పటికప్పుడు మార్చేస్తారు. సెలబ్రిటీగా ఉండటం చిన్న విషయం కాదు. మైంటైసెన్సె కి లక్షల్లో ఖర్చవుతుంది. ట్రిప్ ముగిశాక సమంత అమెరికా వెళతారట. అక్కడ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి చికిత్స కోసమే ఆమె అమెరికా వెళ్లనున్నారని వినికిడి.

ఇక సమంత లేటెస్ట్ మూవీ ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. అలాగే సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ యాక్షన్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.