Devara Pre Release Event: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం వల్ల ఎన్ని కోట్లు నష్టం వాటిల్లిందో తెలుసా? ఆ డబ్బుతో ఒక సినిమానే తీసేయొచ్చు!

ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదల అవుతున్న సోలో చిత్రం, కాబట్టి అభిమానులు భారీ సంఖ్యలో హాజరు అవుతారని ముందుగానే ఊహించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో అందరూ శిల్ప కళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ మేకర్స్ అనూహ్యంగా హోటల్ నోవొటెల్ లో ఏర్పాటు చేసారు.

Written By: Vicky, Updated On : September 23, 2024 4:24 pm

Devara Pre Release Event

Follow us on

Devara Pre Release Event: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్ర ‘దేవర’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం మేకర్స్ నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నోవొటెల్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. అయితే సభ ప్రాంగణం చిన్నది అవ్వడంతో అభిమానులు అసంఖ్యాకంగా రావడం వల్ల సెక్యూరిటీ వాళ్ళను కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ రాకముందే ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇక ఆయన వస్తే క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టమని పోలీసులు మేకర్స్ కి తెలపడంతో వాళ్ళు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసారు.

ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదల అవుతున్న సోలో చిత్రం, కాబట్టి అభిమానులు భారీ సంఖ్యలో హాజరు అవుతారని ముందుగానే ఊహించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో అందరూ శిల్ప కళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ మేకర్స్ అనూహ్యంగా హోటల్ నోవొటెల్ లో ఏర్పాటు చేసారు. అందువల్ల సెక్యూరిటీ కారణాల చేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేయాల్సి వచ్చింది. అభిమానులు వేల రూపాయిలను ఖర్చు పెట్టుకొని రెండు రాష్ట్రాల నుండి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలి వచ్చారు. మేకర్స్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ డబ్బులు మొత్తం వృధా అయ్యాయి. అంతే కాదు అసహనం తో అభిమానులు ఈవెంట్ లో ఏర్పాటు చేసిన కుర్చీలను విరగ్గొట్టారు. వీటితో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో అనేకమైన వస్తువులను డ్యామేజ్ చేసారు. అలాగే నిర్మాతలకు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా దాదాపుగా 3 కోట్ల రూపాయిల నష్టం వాటిలినట్టు తెలుస్తుంది. 3 కోట్ల రూపాయిల నష్టం అంటే చిన్న విషయం కాదు. రీసెంట్ గా విడుదలైన ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ఆయ్’, ‘మత్తు వదలరా 2’ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించొచ్చు.

కానీ ‘దేవర’ నిర్మాత కళ్యాణ్ రామ్ కి మూడు కోట్ల రూపాయిల నష్టం పెద్ద విషయమేమి కాదు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది కదా, విడుదలకు రెండు రోజుల ముందు మళ్ళీ ఏర్పాటు చేస్తారని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నేరుగా సెప్టెంబర్ 27 వ తారీఖున థియేటర్స్ లో చూసుకోవడమే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభమైంది, నిన్న కర్ణాటక, చెన్నై మొదలగు ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ లో నేడు కొన్ని సెలెక్టివ్ ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రేపు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.