త్వరలో ప్రభాస్20 ఫస్ట్ లుక్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రభాస్20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ప్రభాస్20 మూవీ జార్జియా లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాలేదని, షూటింగ్ క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కు […]

Written By: admin, Updated On : March 18, 2020 5:40 pm
Follow us on

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రభాస్20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ప్రభాస్20 మూవీ జార్జియా లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాలేదని, షూటింగ్ క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కు దర్శకుడు రాధాకృష్ణ చెక్ పెట్టారు.

రాధాకృష్ణ మాట్లాడుతూ .. జార్జియా లో ప్రభాస్20 మూవీ షూటింగ్ క్యాన్సిల్ కాలేదని, షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే జరిగిందని ఒక ఛేజ్ సీన్, ప్రభాస్ , పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించానని, కరోనా వైరస్ ప్రభావంతో షెడ్యూల్ ప్రకారం చివరి రెండు రోజులు తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ కంప్లీట్ చేయడానికి టీమ్ శ్రమించారని, దర్శకుడు రాధాకృష్ణ రూమర్స్ ను క్లారిఫై చేశారు. గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ప్రభాస్20 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం.