Director misjudged Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక అలాంటి సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా వస్తాయనే చెప్పాలి. చిరంజీవి చేసిన సినిమాలన్నింటిలో కొన్ని గొప్ప సినిమాలుగా నిలిస్తే మరికొన్ని ప్లాపులుగా కూడా మిగిలాయి. అయితే ఒక దర్శకుడు చిరంజీవి తనతో సినిమా చేయడనే ఒక అపోహతో ఉండేవారట. కానీ అదిరిపోయే కథ చెబితే చిరంజీవి ఎవరితోనైనా సరే సినిమా చేస్తారని తన సన్నిహితులు చెప్పడంతో ఒక మంచి కథను తీసుకెళ్లి చిరంజీవికి వినిపించాడు. ఇక దాంతో చిరంజీవి అతనికి అవకాశం అయితే ఇచ్చాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే గుణశేఖర్ కావడం విశేషం…
గుణ శేఖర్ అంతకుముందే లాఠీ, సొగసు చూడతరమా, బాల రామాయణం లాంటి సినిమాలు చేశాడు. అయితే అతని దగ్గర ఒక మంచి కథ ఉంది. అది చిరంజీవి రేంజ్ కి సరిపోతుంది కానీ చిరంజీవి నాతో సినిమా చేయడు కదా అని తన సన్నిహితులు దగ్గర చెబితే వాళ్లు చిరంజీవి కి నచ్చితే ఆయన ఎవరితో నైనా సినిమాలు చేస్తాడు అని తనకు సలహాలు ఇచ్చి చిరంజీవి దాకా ఆ కథను చేరవేసే ప్రయత్నం చేయమని చెప్పారట.
దాంతో అశ్విని దత్ కి కథను వినిపించి ఆ తర్వాత అతని సహాయంతో చిరంజీవికి చెప్పాడట. చిరంజీవికి ఆ కథ నచ్చడంతో ఆ సినిమా వర్కౌట్ అయింది. ‘చూడాలని ఉంది’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజులకు పైన ఆడి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘మృగరాజు’ అనే సినిమా వచ్చింది.
అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మరోసారి చిరంజీవి గుణశేఖర్ తో సినిమా అయితే చేసే ప్రయత్నం చేయలేదు…మొత్తానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి…ప్రస్తుతం గుణ శేఖర్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…
