Dil Raju Mega Fans Controversy: సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ తీవ్రమైన అసహనం తో ఊగిపోతున్నారు. ఒకపక్క ‘పెద్ది’ మూవీ కి పొటెన్షియల్ కి తగ్గ ప్రొమోషన్స్ చేయడం లేదని మేకర్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే , మరోపక్క తెలంగాణ లో కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చేసేందుకు నిర్మాతలు ఒప్పుకోవాలని , లేదంటే మే 29 నుండి థియేటర్స్ బంద్ చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ , అతని పార్టనర్ సునీల్ నారంగ్ వంటి వారు నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , థియేటర్స్ ని రక్షించాలంటే, కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చెయ్యాలని , ప్రతీ రాష్ట్రంలోనూ ఇదే పద్దతిలో థియేటర్స్ రన్ అవుతున్నాయని, కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని, #RRR చిత్రం నుండి ఇప్పటి వరకు వందల థియేటర్స్ తెలంగాణ లో క్లోజ్ అయ్యాయని శిరీష్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.
వాళ్ళ డిమాండ్స్ సముచితంగానే ఉన్నాయి, కానీ మెగా హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్లకు ఇలాంటి సమస్యలన్నీ గుర్తుకొస్తాయి , మిగిలిన సినిమాలకు అసలు గుర్తుకు రావంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. గతం లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విషయం లో కూడా ఇదే జరిగిందని , సాక్ష్యాత్తు ఉపముఖ్యమంత్రి హోదా లో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాకే వీళ్ళు అడ్డు పడాలని చూశారని , ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విషయం లోనూ అదే చేస్తున్నారని అంటున్నారు. ఈ సంవత్సరం మొదలై నాలుగు నెలలు పూర్తి అయ్యింది, ఈ నాలుగు నెలల్లో ఎందుకు ఈ సమస్యని పరిష్కరించుకోలేకపోయారు?, సరిగ్గా పెద్ది సినిమా విడుదల సమయం లోనే థియేటర్స్ పడుతున్న కష్టాలు గుర్తుకొచ్చాయా..?.
ఇలా టార్గెట్ చేస్తూ , మళ్ళీ మేము ఏ సినిమాని టార్గెట్ చేయడం లేదు , దయచేసి అర్థం చేసుకోండి అంటూ వివరణ ఇవ్వడం చాలా హాస్యాస్పదం గా ఉంది అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు గ్యాంగ్ కి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు అధిక ప్రాధన్యత ఇవ్వడం నచ్చడం లేదని , అందుకే సరిగ్గా మెగా హీరోల సినిమాలు విడుదల సమయంలోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియా లో విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని మొదలు పెట్టినప్పటి నుండి దిల్ రాజు వాళ్ళని టార్గెట్ చేశాడని , అంతే కాకుండా స్టార్ హీరోల సినిమాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి , కుళ్ళు తో వాళ్ళని తొక్కే ప్రయత్నం లో భాగంగానే ఇలా చేస్తున్నారని అంటున్నారు నెటిజెన్స్, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.