NTR Son Jayakrishna: ఎన్టీయార్ గారే తన కొడుకు జయకృష్ణను హీరో అవ్వకుండా అపేసాడా..? కారణం ఏంటి..?

NTR Son Jayakrishna: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు(NTR). సినిమా ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కూడా ఆయన ఎనలేని సేవలను అందించాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన నట వారసుడిగా తన పెద్ద కుమారుడైన ‘రామకృష్ణ ‘ ని ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. కానీ రామకృష్ణ కి 17 సంవత్సరాల వయసు లో ‘మసూచి ‘ వ్యాధి సోకడంతో తను చనిపోయాడు. ఇక దాంతో తన రెండో కుమారుడు అయిన జయకృష్ణ ను ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ అది సక్సెస్ కాలేదు.

ఎందుకు అంటే ఎన్టీఆర్ జయ కృష్ణ కి స్క్రీన్ టెస్ట్ చేయడానికి కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగే కొన్ని డైలాగ్స్ ని కూడా చెప్పమని తనకి చెప్పాడట. దాంతో జయకృష్ణ డైలాగులు బట్టి పట్టినప్పటికీ కెమెరా ముందుకు వచ్చేసరికి మాత్రం మర్చిపోవడం గాని, తడబడడం గానీ చేశాడట. దాంతో స్క్రీన్ టెస్ట్ ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 అయిన కూడా ఆ రెండు డైలాగులు చెప్పలేకపోవడంతో ఎన్ టి ఆర్ నువ్వు ఆర్టిస్ట్ గా పనికి రావని అందరి ముందే తనని తిట్టాడట. దాంతో జయ కృష్ణ తీవ్రమైన మనస్థాపానికి గురై ఇక లైఫ్ లో ఒక్కసారి కూడా మేకప్ వేసుకోను అనే నిర్ణయం తీసుకున్నాడట.

ఇక జయకృష్ణ విషయంలో ఎన్టీఆర్ అలా అందరి ముందు తిట్టేకంటే, తనని పర్సనల్ కూర్చోబెట్టి తనకి చెప్పి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయిస్తే బాగుండేది అని, అలా చేస్తే నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడమే కాకుండా, స్టార్ హీరో గా కూడా కొనసాగే వాడని ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నందమూరి అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు…

ఇక తనని ఇండస్ట్రీలో హీరోగా రాకుండా ఎన్టీఆర్ అడ్డుకున్నాడని అప్పట్లో చాలా కథనాలు కూడా వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ మాత్రం తన వారసుడిగా బాలకృష్ణ నే ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…

Get notified whenever we post something new!

Continue reading

AP Rain Alert: ఏపీకి తీపికబురు.. ఇక అన్నీ మంచి రోజులే

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిస్సా పై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల మందగమనం కనిపిస్తోంది....

AP land allotment: ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ భూమిపై పూర్తి హక్కులు సంబంధిత యాజమాన్యాల కేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

Two Men Marriage: ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage: ఎల్‌నినో ప్రభావం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. అయితే వానదేవుడని ప్రసన్నం చేసుకునేందుకు ఒడిశాలో ఓ గ్రామస్థులు శతాబ్దాల నాటి ఒక వినూత్నఆచారాన్ని పునరుద్ధరించారు. కాల్వలు, చెరువులు ఎండిపోయి, పంటలు పండక అల్లాడుతున్న తరుణంలో, ప్రకృతిని శాంతింపజేయడానికి ఈ...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version