
యావత్తు సినీ లోకం కరోనా వైరస్ కారణంగా అగమ్యగోచరంలో పడిందనేది వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్ లో కరోనా కారణంగా దాదాపు 80 సినిమాలు ఆగిపోయాయట. 80 సినిమాలు అంటే.. సుమారు వేలమంది ఉపాది పోయినట్లే. తాజాగా ఇండిస్ట్రీ వర్గాలు లెక్కల ప్రకారం వందల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు కరోనా కోరల్లో ఇరుక్కుపోయాయి. ప్రతి ఏటా టాలీవుడ్ లో సుమారు 200 సినిమాలకు పైగా తెరకెక్కుతాయనేది అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాల్లో సగంకు పైగా చిన్న సినిమాలే. చిన్న నిర్మాతలు ఫైనాన్స్ తెచ్చి ఈ సినిమాలను చేస్తారు.
Also Read: మాజీ మిస్ ఇండియా వరల్డ్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్
ఇప్పుడు ఈ చిన్న నిర్మాతల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. చేసిన అప్పులు కట్టాల్సిందే అనేది అప్పు ఇచ్చిన వారి డిమాండ్. కానీ ఆ అప్పుల కట్టే అవకాశం లేదు. బాగున్నా సినిమాకి తరువాతైనా డబ్బులు వస్తాయి. మరి ప్లాప్ సినిమాకి ? ఆ నిర్మాతలకు టీ డబ్బులు కూడా రావు. ఇప్పుడు వారి పరిస్థతి ఏమిటో ? పాపం వారి నష్టాలు ఎంత మేర ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయలేమని.. సినిమాలు రిలీజ్ అయితే గాని క్లారిటీ రాదు.
ఇది పరిశ్రమకు పెద్ద దెబ్బగా మిగలబోతుంది. చిన్న నిర్మాతలు ఇక సినిమాలు చేయాలంటే భయపడే పొజిషన్. ఇఫ్పటికిప్పుడు సినిమా హాళ్ళకు అనుమతులు ఇవ్వటం సాధ్యమైయ్యే పని కాదు, ఇచ్చినా సినిమాని రిలీజ్ చేయడానికి మళ్ళీ అప్పు చేయాలి.
Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !
వీరి నష్టం ఒకెత్తు అయితే, దీనికి తోడు పరిశ్రమ పై ఆధారపడిన, వివిధ శాఖల్లో పనిచేసే సుమారు పది వేల మంది వరకు ఉపాధి కోల్పోయి నానా ఆగచాట్లు పడుతున్నారు. మరి ఈ కరోనా కాలం ఎప్పుడు ముగుస్తుందో, సినిమా కాలం ఎప్పుడు మొదలవుతుందో గాని సినీ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది.