
రాను రాను చిత్ర నిర్మాణం నిర్మాతలకు గుదిబండగా మారుతోంది. సరైన ప్లానింగ్ లేక పోవడం తో నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ విషయం మెగా స్టార్ చిరంజీవి గమనించి ఇక మీదట సినిమాల్లో నటించే విషయం లో వేగం పెంచబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన .ఈ చిత్రం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదట… వెంటనే తన 153వ సినిమా గా మళయాళ చిత్రం ‘లూసిఫర్` రీమేక్ స్టార్ట్ చేయాలను కుంటున్నాడట … దరిమిలా సాహో చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు సుజిత్ ఈ సినిమా స్క్రిప్ట్ ని తయారు చేసే పనిలో బిజీ గా ఉన్నాడట…. .ఆ క్రమంలో చిరంజీవికి ఉన్న స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సుజిత్ కథలో పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడని తెలుస్తోంది .
కాంగ్రెస్ తరహా రాజకీయాలతో బీజేపీలో కన్నా `ఏకాకి’!
వాటిలో మొదటగా మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమాలో జోడి ఉండేలా సుజిత్ స్క్రిప్ట్ ని మార్చాడట… . నిజానికి మళయాళ లూసిఫర్ చిత్రం లో హీరో మోహన్ లాల్ కి జోడీ ఉండదు. ఇక ఈ చిత్రం తో పాటు కజిన్ అయిన దర్శకుడు మెహర్ రమేష్ తో, జై లవకుశ ఫేమ్ దర్శకుడు బాబీలతో కూడా చిరంజీవి కథా చర్చలు చేసినట్టు తెలుస్తోంది.
కాగా వీరిలో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేసే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి..దర్శకుడు బాబీ ఇప్పటికే తన సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ చిరంజీవికి వినిపించగా ఆయన ఓకె చేశారని తెలుస్తోంది .