Homeఎంటర్టైన్మెంట్Childhood Photo : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి..ఇప్పుడు వెయ్యి కోట్ల హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?

Childhood Photo : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి..ఇప్పుడు వెయ్యి కోట్ల హీరోయిన్..ఎవరో గుర్తుపట్టగలరా?

Childhood Photo  : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?, ఈమె కేవలం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్. ఈమె తల్లిదండ్రులు మంచి ఆస్తి పరులే, చిన్నతనం నుండి బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ లాగా పెరిగింది ఈ అమ్మాయి. అయినప్పటికీ మోడలింగ్ మీద మక్కువ తో ఆ రంగంలోకి అడుగుపెట్టింది. అలా పాపులారిటీ సంపాదించిన తర్వాత ఈమెకు ఒక లెజెండరీ క్రికెటర్ బయోపిక్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. అక్కడి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె మూడు సినిమాలు చేస్తే, కేవలం ఒక్కటి మాత్రమే హిట్, మిగిలిన రెండు సినిమాలు ఫట్, అయినప్పటికీ దర్శకనిర్మాతలు ఈమె కాల్ షీట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆమె మరెవరో కాదు కియారా అద్వానీ(Kiara Advani).

Also Read : తన చేతులారా తనే కెరియర్ నాశనం చేసుకున్న ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

తెలుగు లో ఈమె ‘భరత్ అనే నేను’ చిత్రంతో మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, ఆ తర్వాత రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. తెలుగు లో ఈమెకు సక్సెస్ రేట్ చాలా తక్కువే, కానీ బాలీవుడ్ లో మాత్రం ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని, హిందీ లో ‘కబీర్ సింగ్’ పేరుతో సందీప్ వంగ రీమేక్ చేయగా, అందులో హీరోయిన్ గా కియారా అద్వానీ ని తీసుకున్నారు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత అలాంటి సినిమాలు కియారా అద్వానీ కి కామన్ అయిపోయాయి.

అలా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె లేటెస్ట్ గా ‘వార్ 2′,’టాక్సిక్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఇకపోతే కియారా అద్వానీ 2023 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళై దాదాపుగా రెండేళ్లు పూర్తి కావొస్తుంది. రీసెంట్ గా కియారా అద్వానీ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. రీసెంట్ గానే ఈమె బేబీ బంప్ తో ఒక ఫోటో షూట్ కూడా చేసింది. త్వరలోనే అమ్మాయికి, లేదా అబ్బాయికి ఈమె జన్మని ఇవ్వనుంది. పిల్లల్ని కన్న తర్వాత ఈమె సినిమాలు చేస్తుందో లేదో

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular