చైనాలో పుట్టిన కరోనా వైరస్ నెమ్మది నెమ్మదిగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో చాలామంది మృత్యువాతపడ్డారు. ఈ మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీతోపాటు హైదరాబాద్లో ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో కేంద్రంతోపాటు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించాయి.
హైదరాబాద్లో కరోనా వైరస్ కేసు నమోదయింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేగింది. మరోవైపు ‘కరోనా’ను నియంత్రించేందుకు వైద్యులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రపంచ జనాభా అంతా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాపై ఛార్మి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు. దీంతో వీడియోను డిలీట్ చేయడంతోపాటు నెటిజన్లకు క్షమాపణ చెప్పింది.