Janhvi Kapoor: నరాలు జివ్వు మనిపించేలా జాన్వీ కపూర్ నడుము వంపులు… కొప్పున పూలు పెట్టి హొయలు పోతున్న దేవర హీరోయిన్, గ్లామరస్ లుక్ వైరల్!

దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎన్టీఆర్ వంటి స్టార్ సరసన ఆఫర్ కొట్టేసింది జాన్వీ. అందుకు ప్రధాన కారణం ఆమె శ్రీదేవి కూతురు కావడమే. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ కలిసి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. అనేక బ్లాక్ బస్టర్ వీరిద్దరి ఖాతాలో ఉన్నాయి. వారి వారసుల కాంబోలో వస్తున్న దేవర పై జనాల్లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది.

Written By: S Reddy, Updated On : July 13, 2024 9:04 am

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: జాన్వీ కపూర్ సౌత్ ఇండియాను ఏలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఖాతాలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేవర చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన దేవర దసరాకు వాయిదా పడింది. ఆ డేట్ కూడా ఫైనల్ కాదు. ప్రీ ఫోన్ చేస్తూ సెప్టెంబర్ 27న విడుదల అంటూ ప్రచారం జరుగుతుంది.

దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎన్టీఆర్ వంటి స్టార్ సరసన ఆఫర్ కొట్టేసింది జాన్వీ. అందుకు ప్రధాన కారణం ఆమె శ్రీదేవి కూతురు కావడమే. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ కలిసి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. అనేక బ్లాక్ బస్టర్ వీరిద్దరి ఖాతాలో ఉన్నాయి. వారి వారసుల కాంబోలో వస్తున్న దేవర పై జనాల్లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది.

దేవర విడుదల కాకుండానే జాన్వీ కపూర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. రామ్ చరణ్ 16వ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్ర దర్శకుడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో మూవీ లాంచ్ చేశారు. ఆర్సీ 16 ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనుంది. విలేజ్ రివేంజ్ డ్రామా అంటున్నారు.

ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఆర్సీ 16 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుండి కూడా బయటపడ్డారట. ఆయన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని అంటున్నారు. ఒక్కసారి ఆర్సీ 16 షూటింగ్ మొదలైతే మూవీ చకచకా పూర్తి కానుంది. దేవర, ఆర్సీ 16 చిత్రాల్లో ఏది హిట్ అయినా జాన్వీ కపూర్ సౌత్ లో జెండా పాతినట్లే. ప్రస్తుతం బాలీవుడ్ కి మించిన భారీ ప్రాజెక్ట్స్ తెలుగులో తెరకెక్కుతున్నాయి.

జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమై చాలా కాలం అవుతుంది. ఆమె ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. చెప్పాలంటే ఆమెకు స్టార్స్ పక్కన ఛాన్సులు రాలేదు. ఇక జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడకుండానే ఆమె తల్లి శ్రీదేవి కన్నుమూసింది. 2018లో జరిగిన ప్రమాదంలో శ్రీదేవి కన్నుమూశారు.

ఇక సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ సందడి మామూలుగా ఉండదు. ఆమె గ్లామరస్ అవతార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఆమెను ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు. తరచుగా హాట్ ఫోటో షూట్స్ తో ఆమె వార్తల్లో నిలుస్తోంది. మోడల్ గా కూడా భారీగా ఆర్జిస్తోంది.

తాజాగా జాన్వీ కపూర్ హై ప్రొఫైల్ మ్యారేజ్ కి హాజరైంది. ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుకలో జాన్వీ కపూర్ పాల్గొంది. ఆమె డిజైనర్ చోళీ లెహంగా ధరించింది. ఆ డ్రెస్ లో జాన్వీ కపూర్ నడుము అందాలు హైలెట్ అవుతున్నాయి. కుర్రాళ్ళకు కిక్ ఇచ్చేలా ఆమె లుక్ ఉంది. కొప్పులో పూలు పెట్టి పెళ్లి వేడుక కోసం ట్రెడిషనల్ గా తయారైంది జాన్వీ కపూర్.

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు జాన్వీ కపూర్ తన ప్రియుడితో హాజరు కావడం కొసమెరుపు. శిఖర్ పహారియాతో ఆమె జంటగా కనిపిస్తున్నారు. జాన్వీ కపూర్-శిఖర్ అంబానీ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.