కరోనా కోసం హాలీవుడ్ ,బాలీవుడ్ తారల సంగీత విభావరి

సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫార్మ్ అయిన పేస్ బుక్ మరియు గివ్ ఇండియా ఆధ్వర్యం లో ” I FOR INDIA “పేరుతొ కరోనా భాదితుల సహాయ నిధికి విరాళాల సేకరణకు నడుం బిగించింది. భారత దేశం లోని సుమారు 100 ఎన్ జి ఓ సంస్థలకు నిధులు సేకరించి ఇచ్చే క్రమంలో హాలీవుడ్ , బాలీవుడ్ తారలు మరియు ప్రసిద్ధ క్రీడాకారులు అంతా కలిసి ఒక ఆన్ లైన్ సంగీత విభావరి చేయబోతున్నారు. కాగా […]

Written By: admin, Updated On : May 2, 2020 7:52 pm
Follow us on


సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫార్మ్ అయిన పేస్ బుక్ మరియు గివ్ ఇండియా ఆధ్వర్యం లో ” I FOR INDIA “పేరుతొ కరోనా భాదితుల సహాయ నిధికి విరాళాల సేకరణకు నడుం బిగించింది. భారత దేశం లోని సుమారు 100 ఎన్ జి ఓ సంస్థలకు నిధులు సేకరించి ఇచ్చే క్రమంలో హాలీవుడ్ , బాలీవుడ్ తారలు మరియు ప్రసిద్ధ క్రీడాకారులు అంతా కలిసి ఒక ఆన్ లైన్ సంగీత విభావరి చేయబోతున్నారు. కాగా ఈ సంగీత కార్య క్రమంలో భారత దేశంలోని సుప్రసిద్ధ సంగీత దర్శకులు అంతా పాల్గొంటున్నారు. “ఏ. ఆర్ . రెహ్మాన్ , శంకర్ ఎహసాన్ జాయ్ , ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ , జకీర్ హుస్సేన్ , అనుష్క శంకర్ , మరియు విశాల్ భరద్వాజ్ వంటి సంగీత దర్శకులతో పాటు శ్రేయ ఘోషల్ , సోను నిగమ్ ,సునిధి చౌహాన్ “వంటి గాయనీ గాయకులూ కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొంటారు.

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ

ఇక తారల విషయానికి వస్తే బాలీవుడ్ టాప్ స్టార్స్ అక్షయ్ కుమార్ , అమిర్ ఖాన్ , షారుఖ్ ఖాన్ , అనిల్ కపూర్ , సైఫ్ అలీ ఖాన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ , ప్రియాంక చోప్రా , కరీనా కపూర్ , మాధురి దీక్షిత్ పాల్గొంటారు. అలాగే హాలీవుడ్ కి చెందిన విల్ స్మిత్ , మిక్ జాగర్ , బ్రయాన్ ఆడమ్స్ , జోనస్ బ్రదర్స్ మరియు సోఫియా టర్నర్ పాల్గొంటారు. ఇక క్రీడారంగానికి చెందిన విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ , సానియా మీర్జా కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొంటారు

ఈ కార్యక్రమం ద్వారా కరోనా లాక్ డౌన్ వల్ల కూడు , గూడు లేక భాదపడుతున్న వారికి ఆర్ధిక సాయం అందించడం తో పాటు , ఇళ్లలో బందీలుగా ఉండి బోర్ ఫీల్ అవుతున్నవారికి ఆనందం కలిగించడం, కరోనా భాదితుల సేవలో నిమగ్న మైన వైద్య సిబ్బందికి , పోలీసులకు , పారిశుద్ధ్య కార్మికులకు నివాళులు అర్పించడం జరుగుతుంది. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ సంగీత కార్యక్రమం మే 3. వ తారీకు రాత్రి 7.30 నిమిషాలకు పేస్ బుక్ లో ప్రారంభమై 4 గంటల పాటు కొనసాగుతుంది.