Bigg Boss Telugu 8: ప్రేరణ ని లెక్క చేయని యష్మీ..ఇచ్చి పారేసిన ప్రేరణ..ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన గొడవ!

ఇప్పటి వరకు పృథ్వీ ఇంటికి మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి, ఈ టాస్క్ గెలవడానికి పృథ్వీ ప్రధాన కారణం కాబట్టి, అందరూ పృథ్వీ పేరు ని ఎంచుకుంటారు. కానీ ప్రేరణ మాత్రం ఏమి సమాధానం చెప్పదు. ఆ తర్వాత యష్మీ అందరం నిన్నే కంటెండర్ ని చేయాలని అనుకుంటున్నాము కానీ ప్రేరణ కి మాత్రం ఇష్టం లేదు, మెజారిటీ నిన్నే అనుకుంటున్నారు కాబట్టి, నువ్వే చీఫ్ కంటెండర్ అని చెప్తుంది.

Written By: Vicky, Updated On : October 24, 2024 8:40 am

Bigg Boss Telugu 8(151)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో క్యూట్ ఫ్రెండ్స్ గా అనిపించే ప్రేరణ, యష్మీ మధ్య చిన్నపాటి గొడవ జరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రతీ విషయంలోనూ ఒకరికోసం ఒకరు తోడు ఉంటూ, స్నేహితులు అంటే ఇలా ఉండాలి, వీళ్ళ మధ్య స్నేహం చాలా స్వచ్ఛమైనదిగా ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకునేవాళ్ళు. అలాంటి వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగేసరికి, అయ్యో..మళ్ళీ కలిసిపోతే బాగుండును అని చాలా మంది అనుకున్నారు. ఇంతకీ వీళ్ళ మధ్య గొడవ ఎందుకు జరిగిందో చూద్దాం. ఓజీ క్లాన్ నుండి నిఖిల్, పృథ్వీ రెండవ లెవెల్ టాస్క్ ఆడేందుకు ముందుకు వెళ్తారు. వీళ్ళను అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ వస్తారు. యష్మీ ఈ టాస్క్ కి సంచాలక్ గా వ్యవహరిస్తుంది.

ఈ టాస్క్ లో నిఖిల్, పృథ్వీ విశ్వరూపం చూపిస్తారు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే, ఎంట్రీ గేట్ నుండి కొన్ని గోధుమ బస్తాలు పడుతాయి. వాటిని ఇరు క్లాన్ సభ్యులలో ఎవరో ఒకరు పట్టుకొని, వాళ్ళ క్లాన్ కి సంబంధించిన బండిపై వెయ్యాలి. ఈ టాస్క్ లో పృథ్వీ, మెహబూబ్..అలాగే గౌతమ్,నిఖిల్ చాలా ఫిజికల్ అవుతారు. వీళ్ళ మధ్య జరిగిన పోరుని చూసి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ భయపడిపోయారు. నలుగురు బలవంతులు ఈ టాస్క్ లో ఆడుతుండడంతో ఎవరు గెలుస్తారు అనే దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఈ టాస్క్ లో నిఖిల్, పృథ్వీ గెలిచి ఓజీ క్లాన్ ని విన్ అయ్యేలా చేస్తారు. ఓజీ క్లాన్ గెలవడంతో బిగ్ బాస్ మీ టీం నుండి ఎవరినో ఒకరిని నేరుగా మెగా చీఫ్ కంటెండర్ ని చెయ్యొచ్చు, ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారో చర్చించుకొని బిగ్ బాస్ కి చెప్పండి అంటారు.

ఇప్పటి వరకు పృథ్వీ ఇంటికి మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి, ఈ టాస్క్ గెలవడానికి పృథ్వీ ప్రధాన కారణం కాబట్టి, అందరూ పృథ్వీ పేరు ని ఎంచుకుంటారు. కానీ ప్రేరణ మాత్రం ఏమి సమాధానం చెప్పదు. ఆ తర్వాత యష్మీ అందరం నిన్నే కంటెండర్ ని చేయాలని అనుకుంటున్నాము కానీ ప్రేరణ కి మాత్రం ఇష్టం లేదు, మెజారిటీ నిన్నే అనుకుంటున్నారు కాబట్టి, నువ్వే చీఫ్ కంటెండర్ అని చెప్తుంది. అప్పుడు ప్రేరణ కి కోపం వస్తుంది. నన్ను అడగకుండా, నా నిర్ణయం నువ్వెలా చెప్తావు అని అంటుంది. అలా ఇద్దరి మధ్య గొడవ చాలా పెద్దది అవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ లో చూసినప్పుడు గొడవ తర్వాత వీళ్లిద్దరు చాలాసేపటి వరకు మాట్లాడుకోలేదు. కానీ పడుకునే ముందు యష్మీ ప్రేరణ వద్దకు వచ్చి, క్షమాపణలు చెప్పి హాగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ స్నేహితులు అయిపోయారు. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్ లో జరిగిన సంఘటనలు. ఈరోజు రాత్రి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. నేడు రాత్రి ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ సీజన్ 8 లోనే ది బెస్ట్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.