Bigg Boss Telugu 8: నీ దగ్గర అసలు మ్యాటర్ లేదు..విష్ణు ప్రియ భిక్ష తో బ్రతుకుతున్నావ్ అంటూ పృథ్వీ పై రెచ్చిపోయిన రోహిణి!

మొదటి నుండి పృథ్వీ లో ఉన్న మైనస్ పాయింట్స్ ని మళ్ళీ ఎత్తి చూపిస్తూ నామినేషన్స్ వేసింది. ఆమె హౌస్ లోకి వచ్చిన మొదటి వారం అలాంటి పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు.

Written By: Vicky, Updated On : October 22, 2024 9:01 am

Bigg Boss Telugu 8(144)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో పృథ్వీ, రోహిణి మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముందుగా రోహిణి పృథ్వీ ని టార్గెట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె వద్ద నామినేషన్స్ పాయింట్స్ వేయడానికి పెద్దగా ఎవ్వరూ దొరకలేదు. మొదటి నుండి పృథ్వీ లో ఉన్న మైనస్ పాయింట్స్ ని మళ్ళీ ఎత్తి చూపిస్తూ నామినేషన్స్ వేసింది. ఆమె హౌస్ లోకి వచ్చిన మొదటి వారం అలాంటి పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అప్పటి పాయింట్స్ ని ఇప్పుడు కూడా చెప్పి నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పే. ఇక రివెంజ్ నామినేషన్స్ కి కింగ్ అయినటువంటి పృథ్వీ మళ్ళీ తిరిగి ఆమెని నామినేట్ చేసాడు, రోహిణి నువ్వు దేనికి పనికి రావు అన్నట్టుగా పృథ్విపై కామెంట్స్ చేసింది, ఇక ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోయే పృథ్వీ రోహిణి ని బాడీ షేమింగ్ చేసాడు.

ఇది మాత్రం ముమ్మాటికీ పృథ్వీ తప్పే, అలా చేయకుండా ఉండాల్సింది. ఇంతకీ రోహిణి పృథ్వీ ని నామినేట్ చేసిన పాయింట్ ఏమిటంటే ‘నువ్వు హౌస్ లో నాకు టాస్కులు ఆడేటప్పుడు, మిగిలిన సమయాల్లో విష్ణు ప్రియ తో తప్ప, నాకు ఎక్కడ కనిపించడం లేదు. హౌస్ లో ఒక్క పని కూడా చేయవు, ఇతర కార్యక్రమాల్లో అసలు పాల్గొనవు’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి పృథ్వీ సమాధానం ఇస్తూ ‘మరి హౌస్ లో ఏమి చేయాలి ఇంకా?, మీలాగా జోక్స్ చేయాలా?, నాకు ఇచ్చిన ప్రతీ పనిని నేను చేస్తున్నాను, టాస్కులలో నా బెస్ట్ ఇస్తున్నాను, ఇంకేమి కావాలి’ అని అంటాడు. నన్ను అంటున్నావ్, ఇంతకు నువ్వు హౌస్ లో జోక్స్ తప్ప ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు పృథ్వీ. అప్పుడు రోహిణి ‘నువ్వు నా నామినేషన్ లో అడుగుతావేంటి, నీ నామినేషన్ అప్పుడు అడుగు చెప్తా’ అని అంటుంది. దానికి పృథ్వీ ‘సరే వెయిట్ చేయి..నా నామినేషన్ అప్పుడు వస్తా’ అని అంటాడు. అప్పుడు పృథ్వీ నామినేషన్ వేస్తూ ‘మీరు కామెడీ చేయడంలో తప్ప, నాకు హౌస్ లో ఎక్కడా కనిపించడం లేదు. టాస్కులు ఆడడంలో మీరు అందరికంటే వీక్’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు రోహిణి ‘నేను ప్రతీ టాస్కులో ఆడాను, ఓడిపోవడం, గెలవడం ముఖ్యం కాదు, ఆడానా లేదా అనేదే ముఖ్యం. గెలవడమే ముఖ్యమైతే నువ్వు 7 వారాల నుండి ఇంట్లో ఉన్నావు, ఇప్పటి వరకు ఎందుకు చీఫ్ అవ్వలేదు?’ అని ప్రశ్నిస్తుంది.

అప్పుడు పృథ్వీ ‘నాకు చీఫ్ అవ్వాలనే ఆసక్తి లేదు..నేను ప్రతీ టాస్కులోను నా వంద శాతం ఇచ్చాను కాబట్టే ఆడియన్స్ నన్ను ఇన్ని రోజులు ఇంట్లో ఉంచారు’ అని అంటాడు. అప్పుడు రోహిణి ‘నీలో అసలు మ్యాటర్ లేదు, నీకు బుర్ర లేదు. నిన్ను ఆడియన్స్ ఎలా సేవ్ చేస్తున్నారో నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నువ్వు కేవలం కొంతమంది కంటెస్టెంట్స్ వల్లనే సేవ్ అవుతున్నావు, వాళ్ళ పేర్లు నేను చెప్పను’ అని అంటుంది. అలా వీళ్ళ మధ్య మాట మాట పెరుగుతుంది. టాస్కులలో పరిగెత్తడం అంత తేలిక కాదు అంటూ పృథ్వీ రోహిణి వైపు అదోలా చూస్తూ బాడీ షేమింగ్ చేస్తాడు. ఇక్కడ ఆయన లిమిట్ దాటేశాడు, దీనికి వీకెండ్ లో నాగార్జున నుండి కోటింగ్ పడే అవకాశం ఉంది.