Bigg Boss 7 Telugu: బట్టలు కట్టించి ఆపై విప్పించి… తేజాను అలా చూడలేక కళ్ళు మూసుకున్న అమ్మాయిలు!

దొరికిన బట్టలు దొరికినట్లు వేసుకున్నారు. ఇక బజర్ మోగడంతో టాస్క్ కంప్లీట్ అయింది. దీనికి సంచాలక్ గా శివాజీ వ్యవహరించాడు. ముందుగా తేజ బట్టలు లెక్కపెట్టమని బిగ్ బాస్ ఆదేశించారు.

Written By: NARESH, Updated On : October 27, 2023 8:59 am

Bigg Boss Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఎనిమిదో వారం కెప్టెన్సీ రేస్ లో భాగంగా కొన్ని టాస్క్ లు ఇస్తూ వస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటికే రెండు రౌండ్స్ పూర్తయ్యాయి. ప్రియాంక,ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. కాగా అమర్ దీప్ ఇంకా రతిక కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నారు. కంటెస్టెంట్స్ కి కెప్టెన్సీ మారథాన్ లో భాగంగా మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ అవకాశం మిగిలిన ఇంటి సభ్యులు తేజ,శోభా,అర్జున్,అశ్విని,యావర్ లకు ఇచ్చారు. వీరిలో ఒకరికి ఆఖరి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ చెప్పారు.

ఈ టాస్క్ లో ఎవరినా ముగ్గురు మాత్రమే ఆడాలి. ఇక ఎవరు ఆడాలి అనేది కాసేపు చర్చించుకుని శోభా,తేజ,యావర్ లు ఆడుతున్నారు అని అర్జున్ ప్రకటించాడు.ఇందుకు’ వేర్ ఇట్ విన్ ఇట్’ అని టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ గెలవడానికి వీలైనన్ని ఎక్కువ బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. బజర్ మోగగానే తేజ,యావర్,శోభా పరుగెత్తుకుంటూ లగేజ్ రూమ్ కి వెళ్లారు. ఇక అక్కడ సూట్ కేసు లో బట్టలు ఒకదాని మీద ఒకటి త్వరగా త్వరగా ముగ్గురు వేసుకున్నారు.

దొరికిన బట్టలు దొరికినట్లు వేసుకున్నారు. ఇక బజర్ మోగడంతో టాస్క్ కంప్లీట్ అయింది. దీనికి సంచాలక్ గా శివాజీ వ్యవహరించాడు. ముందుగా తేజ బట్టలు లెక్కపెట్టమని బిగ్ బాస్ ఆదేశించారు. ఒక్కొక్కటి విప్పుతూ కంటెస్టెంట్స్ వారి బట్టలు లెక్క పెట్టడం మొదలు పెట్టారు.నువ్వు ఎవరెవరివి వేసుకున్నావ్ తేజా అంటూ హౌస్ మేట్స్ నవ్వుకున్నారు.

ఇక బట్టలు విప్పుతూ తేజ సిగ్గు పడ్డాడు ‘అటు తిరగండి రా కొంచెం ఇబ్బందిగా ఉంది’ అని తేజ అన్నాడు. దాంతో అశ్విని కళ్ళు మూసుకుంది. ఇక గౌతమ్ వచ్చి మొత్తం కలిపి 72 ఉన్నాయ్ అన్న అని శివాజీ తో చెప్పాడు. ఇక తేజ నాకు అన్యాయం జరిగితే బాగోదు చెప్తున్నా అని అన్నాడు. బిగ్ బాస్ శివాజీ ని విన్నర్ ఎవరో అనౌన్స్ చెయ్యాలని కోరాడు. ఈ టాస్క్ లో శోభా శెట్టి గెలిచింది. ఆమె మరో కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది.