Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రీ లాంచ్ ఎపిసోడ్ హైలెట్స్… డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్, 5గురు కొత్త కంటెస్టెంట్స్!

అయితే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ లో మిగతా ఆరుగురిని సేవ్ చేస్తూ వచ్చాడు. చివరికి గౌతమ్-తేజా మిగిలారు. వీరిలో ఎవరు షోలో ఉండాలి? ఎవరు బయటకు వెళ్ళిపోవాలో?

Written By: Shiva, Updated On : October 9, 2023 1:08 pm
Follow us on

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రీ లాంచ్ ఈవెంట్ సరికొత్తగా మొదలైంది. హోస్ట్ నాగార్జున ఎలిమినేషన్ తో ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. నామినేషన్స్ లో ఉన్న శివాజీ, శుభశ్రీ, అమర్ దీప్, యావర్, గౌతమ్, తేజా, ప్రియాంకలను డార్క్ రూమ్ కి పంపాడు. వీరిలో ఒకరిని ఘోస్ట్ తీసుకుపోతుంది. వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు. శుభశ్రీని ఘోస్ట్ ఎంచుకుంది. దాంతో శుభశ్రీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. వేదికగా పైకి వచ్చిన శుభశ్రీలో ఎలిమినేట్ అయిన బాధ కనిపించలేదు. నవ్వుతూ హుందాగా ఇంట్లో ఉన్న వాళ్లతో గుడ్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుభవాలు పంచుకుని వేదిక వీడింది.

అయితే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ లో మిగతా ఆరుగురిని సేవ్ చేస్తూ వచ్చాడు. చివరికి గౌతమ్-తేజా మిగిలారు. వీరిలో ఎవరు షోలో ఉండాలి? ఎవరు బయటకు వెళ్ళిపోవాలో? ఇంటి సభ్యులే తేల్చాలని నాగార్జున షాక్ ఇచ్చాడు. గౌతమ్ వెళ్లిపోవాలని ఆరుగురు వ్యతిరేక ఓట్లు వేశారు. సందీప్ మాత్రమే తేజాకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే నాగార్జున గౌతమ్ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు.

గౌతమ్ ఎలిమినేట్ అయినప్పటికీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. అనంతరం హీరో సిద్ధార్థ్ హౌస్లోకి వెళ్ళాడు. తన లేటెస్ట్ మూవీ చిన్నాను ప్రోమోట్ చేసుకున్నాడు. ఓ సరదా గేమ్ ఆడి కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేశాడు. అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీలు మొదలయ్యాయి. మొదట అంబటి అర్జున్ వచ్చాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ స్ట్రాంగ్ ప్లేయర్స్. వాళ్లతో పోటీ పడతా అని చెప్పాడు.

అనంతరం అశ్విని ఎంట్రీ ఇచ్చింది. భోలే షావలి పాట బిడ్డ అంటూ వచ్చాడు. పూజా మూర్తి, నయని పావని వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి అడుగుపెట్టారు. సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ తో పాటు హౌస్లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్ హౌస్ కెప్టెన్. కొత్త వాళ్ళ రాకతో షో రసవత్తరంగా మారింది. ఇక చూడాలి ఏమి కానుందో…