Bigg Boss 7 Telugu: నామినేషన్స్ ప్రక్రియ మొదలు… గుండెల్లో కత్తి దించాలన్న బిగ్ బాస్!

నటుడు శివాజీతో ప్రియాంక, అమర్ దీప్ గొడవ పడినట్లు ఉన్నారు. వారు శివాజీని నామినేట్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రిన్స్ యావర్ ని కూడా ప్రియాంక నామినేట్ చేసింది.

Written By: Shiva, Updated On : October 2, 2023 5:42 pm
Follow us on

Bigg Boss 7 Telugu: ఆదివారం రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌస్లో మిగిలింది 10 మంది మాత్రమే. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ షురూ చేశాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ఓ మందపాటి షీట్ ధరించాల్సి ఉంటుంది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. వారు ధరించిన షీట్ కి కత్తులు దించాలి. ఇక ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.

నటుడు శివాజీతో ప్రియాంక, అమర్ దీప్ గొడవ పడినట్లు ఉన్నారు. వారు శివాజీని నామినేట్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రిన్స్ యావర్ ని కూడా ప్రియాంక నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారానికి 7 గురు నామినేట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలిచారు. వారికి ఇమ్యూనిటీ ఉంది. కాబట్టి వాళ్ళను నామినేట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు నామినేషన్స్ లో ఉండరు.

ఇక తేజా నేరుగా హోస్ట్ నాగార్జున చేత నామినేట్ చేయబడ్డాడు. శిక్షలో భాగంగా అతనికి జైలు తో పాటు ఇంటి పనులు, ఒక వారం నేరుగా నామినేట్ చేయడం జరిగింది. కాబట్టి తేజాతో పాటు అమర్ దీప్, ప్రియాంక, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శివాజీ నామినేషన్స్ లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. టాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీలపై ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కనీసం 5 గురు సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్లోకి ప్రవేశించే అవకాశం కలదు. వీరిలో అధికంగా సీరియల్ నటులు ఉన్నారు. అంబటి అర్జున్, పూజా మూర్తి, నయని పావని, అంజలి పవన్, భోలే షావలి హౌస్లో అడుగు పెడతారంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మినీ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి వీరిని హౌస్లోకి ప్రవేశ పెడతారట.