పవన్ కళ్యాణ్ చిత్రంలో లేడీ విలన్ గా ఆ హీరోయిన్

మిలీనియం ప్రారంభం లో ‘యువకుడు’ చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన భూమిక చావ్లా చాలా తక్కువ టైం లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పు పొందింది.. 2001 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “ఖుషీ ” చిత్రం లో నటించిన భూమిక చావ్లా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది ఆ తరవాత మహేష్ బాబు తో ఒక్కడు చిత్రం , వెంకటేష్ తో వాసు , జూనియర్ ఎన్ […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 4:34 pm
Follow us on

మిలీనియం ప్రారంభం లో ‘యువకుడు’ చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన భూమిక చావ్లా చాలా తక్కువ టైం లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పు పొందింది.. 2001 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “ఖుషీ ” చిత్రం లో నటించిన భూమిక చావ్లా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది ఆ తరవాత మహేష్ బాబు తో ఒక్కడు చిత్రం , వెంకటేష్ తో వాసు , జూనియర్ ఎన్ టి ఆర్ తో సింహాద్రి సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకొంది. అదే సమయంలో ‘తకిట తకిట ‘ చిత్రం తో నిర్మాతగా మారింది. తర్వాత వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమైంది. ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరో గా నటించిన “ఎంసీఏ” చిత్రంలో నాని వదిన పాత్రలో నటించి మెప్పించిన భూమిక ఆ తర్వాత యు టర్న్ ,సవ్యసాచి , రూలర్ చిత్రాల్లో నటించింది. అలా అడపాదడపా పాత్రలను అందిపుచ్చుకుంటున్న భూమిక ఇప్పుడు నెగెటివ్ టచ్ ఉన్నపాత్రలో నటించనుంది.

ఈ విషయాన్ని భూమిక స్వయం గా చెప్పింది. గతంలో మిస్సమ్మ చిత్రంలో నెగటివ్ గా నటించి మెప్పించిన భూమిక ఇపుడు మరోసారి తన లోని విలనిజం చూపించబోతోంది. మిస్సమ్మ చిత్రం లో కొంత మేర విలనిజం చూపించింది, అయితే ఇప్పుడు తాను చేయబోతున్న సినిమాలో పూర్తిస్థాయి విలనిజాన్ని చూపించబోతున్నట్లు తెలిపింది. అయితే తాను ఏ సినిమాలో ఆ పాత్రను చేస్తున్నాననే సంగతి మాత్రం ఇప్పుడే చెప్పలేను అంటూ మాట దాట వేసింది .

చాలా మంది హీరోయిన్ ల మాదిరి గానే డిఫరెంట్ పాత్రలు చేయాలన్న తలంపు తో భూమిక కూడా విభిన్న పాత్రలో నటించనుంది . మరి భూమిక ఏ సినిమాలో నెగెటివ్ పాత్రలో తెలుసా;…. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రాబోతున్న పిరియాడికల్ మూవీ లో .. కాగా .ఈ చిత్రానికి ఖుషి ఫేమ్ ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండటం మరో విశేషం.
Changing according to times