Bandla Ganesh: సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు బండ్ల గణేష్. హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ హాట్ గా ఉంటాయి. మీడియా డిబేట్లో సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అటువంటి బండ్ల గణేష్ ఫ్యామిలీలో ఏది జరిగిన ఒక ట్రెండింగ్ గా నిలుస్తుంది.. తాజాగా ఆయన కుమార్తెకు సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికలో తన అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేష్. ఆయన కుమార్తె జననికి.. పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన చిలుకూరి సూర్య తేజ తో త్వరలో వివాహం జరగనుంది. మే నెలలో నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది . ఇప్పుడు వివాహ శుభ ముహూర్తం దగ్గర పడుతుండడంతో.. వివాహ ఆహ్వాన పత్రికను ప్రముఖులకు అందిస్తున్నారు బండ్ల గణేష్. ఇటువంటి తరుణంలో పెండ్లి శుభలేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
* చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో..
సాధారణంగా పెళ్లి పత్రికల పైన దేవుళ్ళ పేర్లు.. ఇంట్లో పెద్దల పేర్లు వేయించడం చూస్తుంటాం. కానీ బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక పై భాగంలో.. శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు అని ప్రత్యేకంగా ముద్రించారు. నారా కుటుంబంతో బండ్ల గణేష్ కు విడదీయరాని వ్యక్తిగత అనుబంధం ఉంది. ఏకంగా శుభలేఖలో ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి పేరు రాయించడం మాత్రం గమనించదగ్గ విషయం. చంద్రబాబుకు వీరాభిమానిని అని మరోసారి నిరూపించుకున్నారు గణేష్.
* చంద్రబాబు కోసం మొక్కులు..
గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని.. మళ్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని మొక్కుకున్నారు బండ్ల గణేష్. ఇటీవల షాద్నగర్ నుంచి తిరుమల కొండకు కాలినడకన పాదయాత్ర చేసి.. తన ముక్కును చెల్లించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందజేశారు. మొన్న మే నెలలో జరిగిన కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. నూతన దంపతులకు ఆశీర్వాదం అందించారు. ఈ ప్రత్యేక బంధం తోనే కుటుంబ పెద్దల స్థానంలో చంద్రబాబు దంపతుల పేర్లను శుభలేఖ పై వేయించి అభిమానం చాటుకున్నారు బండ్ల గణేష్.
