Bala Krishna: పునీత్ రాజ్ కుమార్ మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన బాలయ్య…

Bala Krishna: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. పునీత్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. ఇక కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కాగా ఈరోజు పునీత్ రాజ్ కుమార్ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 30, 2021 1:46 pm
Follow us on

Bala Krishna: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. పునీత్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. ఇక కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కాగా ఈరోజు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బాలకృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి… పునీత్ అంత్యక్రియలకు హాజరు అవుతున్నారు. బాలయ్య ఇప్ప‌టికే అక్కడకు చేరుకోగా పునీత్ తో ఉన్న అనుబంధాన్ని… గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ ను పట్టుకొని బాలయ్య ఏడ్చేశారు.

అనంతరం పునీత్ కుటుంబ సభ్యులను బాలయ్య ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెంగళూరు బయలుదేరినట్టు తెలుస్తోంది.