యాదగిరిగుట్టలో బాలయ్య యాక్షన్ !

కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్నా.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి నానాకష్టాలు పడుతున్నారు దర్శకనిర్మాతలు. కాగా బాలయ్య – బోయపాటి సినిమా కూడా వచ్చే వారం నుండి షూటింగ్ మొదలుకానుంది. ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నారు. ఎందుకంటే ఈ సీక్వెన్స్ కథకు చాలా కీలకమైనదట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయాలని బోయపాటి టీమ్ బాగానే ప్రయత్నాలు చేసింది. […]

Written By: admin, Updated On : September 12, 2020 5:13 pm
Follow us on


కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్నా.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి నానాకష్టాలు పడుతున్నారు దర్శకనిర్మాతలు. కాగా బాలయ్య – బోయపాటి సినిమా కూడా వచ్చే వారం నుండి షూటింగ్ మొదలుకానుంది. ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నారు. ఎందుకంటే ఈ సీక్వెన్స్ కథకు చాలా కీలకమైనదట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయాలని బోయపాటి టీమ్ బాగానే ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయడం కుదరుదు. పోనీ స్టూడియోల్లో సెట్ వేసి షూట్ చేద్దాం అంటే.. అది సాధ్యం అయ్యే పని కాదు.

Also Read: పవన్, మహేష్ లను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

అందుకే ఇక ఈ సీక్వెన్స్ లో మార్పులు చేశారు. వారణాసి నేపథ్యాన్ని మార్చి.. యాదగిరిగుట్ట నేపథ్యాన్ని తీసుకున్నారట. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బాలయ్య పాత్ర హోమం చేయిస్తూ ఉండగా.. విలన్స్ అటాక్ చేస్తారని.. వారిని చంపే ప్రయత్నంలో సీనియర్ బాలయ్య పాత్ర కూడా ఇక్కడే చనిపోతుందని.. మొత్తానికి ఈ సీక్వెన్స్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. పర్సనల్ గా బాలయ్యకి ఈ సీక్వెన్స్ బాగా నచ్చిందట. అందుకే ఆయన ముందుగా ఈ సీక్వెన్స్ చేద్దామని పట్టుబట్టి మరీ షూటింగ్ పెట్టిస్తున్నారు. నిజానికి చాలా మంది సీనియర్ హీరోలు ఈ సంవత్సరం చివరి వరకు షూటింగ్ షెడ్యూల్స్ ను పూర్తిగా రద్దు చేసుకున్నారు.

Also Read: స్టార్ హీరోల రెమ్యూనిరేషన్ గోల.. సాధ్యమేనా ?

కానీ బాలయ్య మాత్రం షూట్ చేయాల్సిందే అని షూట్ మొదలుపెట్టబోతున్నారు. ఏది ఏమైనా మొత్తానికి కరోనా ఎఫెక్ట్ కూడా బాలయ్యను ఆపలేకపోతొంది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినా.. ఇప్పుడు అది సాధ్యమయ్యేలా లేదు. బాలయ్య పక్కన ఆ కొత్త హీరోయిన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదని.. ఆ కారణంగానే హీరోయిన్ అంజలిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.