కోటప్ప కొండలో బాలయ్య షూటింగ్ !

నట సింహం బాలయ్య బాబు – బోయపాటి సినిమా తరువాత షెడ్యూల్ ను పలనాడులోని కోటప్ప కొండ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకు ప్రత్యేకంగా అక్కడ ఒక సెట్ కూడా వేయడం ఈ రోజు నుండి మొదలుపెట్టారు. ఇక ఈ సెట్ లో ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను తీయడానికి బోయపాటి ప్లాన్ చేశాడు. అన్నట్టు బోయపాటిది ఈ ప్రాంతమే. నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో […]

Written By: admin, Updated On : December 27, 2020 7:03 pm
Follow us on


నట సింహం బాలయ్య బాబు – బోయపాటి సినిమా తరువాత షెడ్యూల్ ను పలనాడులోని కోటప్ప కొండ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకు ప్రత్యేకంగా అక్కడ ఒక సెట్ కూడా వేయడం ఈ రోజు నుండి మొదలుపెట్టారు. ఇక ఈ సెట్ లో ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను తీయడానికి బోయపాటి ప్లాన్ చేశాడు. అన్నట్టు బోయపాటిది ఈ ప్రాంతమే. నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నా.. కుదరలేదు. అందుకే కోటప్ప కొండ మీద షూట్ ను పెట్టుకున్నారు. మొన్నటివరకూ ఈ సీక్వెన్స్ ను యాదగిరిగుట్టలో ప్లాన్ చేశారు.

Also Read: ప్రభాస్ కోసం దర్శకుడితో పూజ హెగ్డే గొడవ !

కాకపోతే అక్కడ కంటే పలనాడు ప్రాంతం అయితేనే నేటివిటీకి దగ్గరగా ఉంటుందని మేకర్స్ ఫీల్ అయ్యారట. అయితే సినిమా బిగినింగ్ ఎపిసోడ్ కి ఒక టెంపుల్ కావాలట. అందుకే ఆ సీక్వెన్స్ కోసం యాదగిరిగుట్టలోని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని తీసుకున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ప్రగ్య జైస్వాల్ పాత్ర ఈ సినిమాలో యంగ్ కలెక్టర్ పాత్ర. నిజానికి బాలయ్య పక్కన కొత్త హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు, కానీ ఆమె బాలయ్య సరసన సరిగ్గా సెట్ అవ్వలేదు.

Also Read: సంక్రాంతికి ‘అల్లుడు’ రాక ఫిక్స్.. అదరగొడతాడా ?

ఆ కారణంగానే హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో బాలయ్య ఎప్పటిలాగే, రొటీన్ పవర్ ఫుల్ డైలాగ్ లతో తన అభిమానులను బాగానే మెప్పించాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాతో రాబోతుంది. మరి ఈ సినిమా బాలయ్యకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్