Balakrishna: భారీ హిందీ డైలాగ్ తో రన్బీర్ ని భయపెట్టిన బాలకృష్ణ… నోరెళ్ళబెట్టిన బాలీవుడ్ హీరో!

లేటెస్ట్ సీజన్ స్టార్ట్ కాగా... బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ హాజరయ్యారు. రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రన్బీర్ కపూర్, ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు.

Written By: NARESH, Updated On : November 24, 2023 4:00 pm

Balakrishna

Follow us on

Balakrishna: అన్ స్టాపబుల్ షోతో బాలకృష్ణలోని కొత్త కోణం ఆవిష్కృతం అయ్యింది. ఆయనలో మంచి హోస్ట్ కూడా ఉన్నాడని తెలిసింది. బాలయ్య యాంకర్ గా టాక్ షో అనగానే భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ఆయన వల్ల కాదని పెదవి విరిచారు. విమర్శలకు చెక్ పెడుతూ… బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ సక్సెస్ చేశాడు. రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ గా ముగిశాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ ని బాలకృష్ణ బోల్డ్ క్వచ్చన్స్ తో అల్లాడించాడు.

లేటెస్ట్ సీజన్ స్టార్ట్ కాగా… బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ హాజరయ్యారు. రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రన్బీర్ కపూర్, ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు. ఈ షోలో బాలకృష్ణ డైలాగ్స్ గురించి రన్బీర్ కపూర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలో బాలయ్య ఓ భారీ హిందీ డైలాగ్స్ అనర్గళంగా చెప్పి రన్బీర్ ని షాక్ కి గురి చేశాడు. బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్ మొఘల్ ఏ ఆజామ్ ఇష్టం అన్న బాలకృష్ణ, ఆ చిత్రంలోని డైలాగ్ గుక్కతిప్పుకోకుండా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

బాలయ్యకు నిలువెత్తు ఆత్మవిశ్వాసమే. తనకు రానిది ఏదీ లేదని ఆయన భావన. అందుకే పాటలైనా, డైలాగ్స్ అయినా వేదికల మీద ప్రదర్శిస్తూ ఉంటాడు. రన్బీర్ కపూర్ బాలీవుడ్ హీరో కావడంతో హిందీ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. యానిమల్ యూనిట్ పాల్గొన్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక యానిమల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో కల్ట్ క్లాసిక్ తో వస్తున్నారని అర్థం అవుతుంది.

యానిమల్ గ్యాంగ్ స్టర్ డ్రామా కాగా… ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కించాడు. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీతో దర్శకుడిగా మారాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేయగా బ్లాక్ బస్టర్ కొట్టింది. అందుకే సందీప్ రెడ్డి వంగా నుండి వస్తున్న మూడో చిత్రం యానిమల్ పై దేశవ్యాప్తంగా హైప్ నెలకొంది.