Balakrishna: సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి సీనియర్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంలో చాలావరకు హెల్ప్ చేశారు. ముఖ్యంగా వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా భారీ బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పాయి. ఇక ఈ ఏజ్ లో కూడా వాళ్ళు వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరో మాస్ సినిమాని చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక వీళ్లిద్దరితో పాటు మరో పాన్ ఇండియా డైరెక్టర్ తో కూడా సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇంతకీ ఆ పాన్ ఇండియా దర్శకుడు ఎవరంటే పూరి జగన్నాథ్ కావడం విశేషం…వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు ‘పైసా వసూల్’ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోయిన కూడా బాలయ్య బాబును చాలా కొత్తగా చూపించిన క్రెడిట్ పూరి జగన్నాథ్ కి దక్కింది. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరు కలిసి మరో సినిమా చేయాలని అప్పుడే అనుకున్నారు.
కానీ ఇన్ని సంవత్సరాల పాటు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి బాలయ్య బాబుతో పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందా? లేదా అనే విషయంలో క్లారిటి రానుంది…
ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాధ్ ఈ మధ్య కాలంలో పూర్తిస్థాయిలో సినిమాలను చేయలేకపోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. పూరి జగన్నాధ్ మాత్రం బాలయ్య బాబుతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటింపజేయాలనే విధంగా కథనైతే రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే బాలయ్యను కలిసి ఆ కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది. ఇక పూరి జగన్నాధ్ స్లమ్ డాగ్ సినిమా సక్సెస్ మీదనే ఈ సినిమా ఆధారపడి ఉంది…
