సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే !

సూపర్ స్టార్ రజినీకాంత్ కి 69 ఏళ్ళ కావడంతో.. షూటింగ్ లో పాల్గొనే రిస్క్ చేయలేకపోతున్నారు. గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో రజినీ కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు బయటకు రాకూడదనే వైద్యుల సలహా మేరకు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కానీ ప్రస్తుతం రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ పరిస్థితే అర్ధం కాకుండా పోయింది. డైరెక్టర్ శివ ఇప్పటికే అన్ని షూట్ కి రెడీ చేసి పెట్టుకున్నాడు. పోనీ మరో […]

Written By: admin, Updated On : November 13, 2020 3:01 pm
Follow us on


సూపర్ స్టార్ రజినీకాంత్ కి 69 ఏళ్ళ కావడంతో.. షూటింగ్ లో పాల్గొనే రిస్క్ చేయలేకపోతున్నారు. గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో రజినీ కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు బయటకు రాకూడదనే వైద్యుల సలహా మేరకు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కానీ ప్రస్తుతం రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ పరిస్థితే అర్ధం కాకుండా పోయింది. డైరెక్టర్ శివ ఇప్పటికే అన్ని షూట్ కి రెడీ చేసి పెట్టుకున్నాడు. పోనీ మరో రెండు మూడు నెలలు తరువాత అయినా షూట్ ఉంటుందా అనేది నమ్మకం లేదు. కరోనా పూర్తిగా తగ్గేవరకూ రజినీ సినిమా చేయలేనని ఇప్పటికే స్పష్టం చేశారట.

Also Read:  వైరల్: ‘ఆర్ఆర్ఆర్’ దీపావళి అప్డేట్.. ఫ్యాన్స్ కు పండుగే..!

పైగా అతి ముఖ్యమైన తన పొలిటికల్ ఎంట్రీని కూడ రజినీ వాయిదా వేసుకున్నాడు అంటే.. రజినీ కరోనాను ఎంత సీరియస్ గా తీసుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు. కానీ సూపర్ స్టార్ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తోందని ఎంతో ఆశ పడ్డ ఫ్యాన్స్ మొత్తానికి ఈ వార్తతో నిరాశ చెందక తప్పదు. అసలు వచ్చే వేసవికి అయినా ఈ సినిమా మొదలు అవుతుందో లేదో చూడాలి. నిజానికి రజనీ ఈ ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ ఇవ్వడమే కాకుండా శివ పై పూర్తి నమ్మకం ఉందని.. అతని టాలెంట్ గురించి పలు సందర్భాల్లో చాల పాజిటివ్ గా చెప్పారు. కానీ సినిమాకి ఇలా మధ్యలోనే బ్రేక్ పడుతుందని రజినీ కూడా ఊహించలేదు.

Also Read: అనుపమ క్యూట్ వేషాలు.. కుర్రాళ్లు ఫిదా..!

మరోపక్క సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రజినీ – శివ కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది గొప్ప టాలెంట్ అనే విషయం ఇప్పటికే ఆయన గత సినిమాలు ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు చూస్తేనే అర్ధం అవుతోంది. అందుకే మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. మరి ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం తక్కువగానే ఉంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్