వివాదాల్లో చిక్కుకున్న అనుష్క

లాక్డౌన్లో విరుష్క జోడీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. నిత్యం తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెల్సిందే. వివాదాలకు దూరంగా ఉండే అనుష్క శర్మ ప్రస్తుతం ఓ వివాదంలో ఇరక్కుపోయింది. ఈమేరకు ఆమెకు లీగల్ నోటీసులు జారీకావడంతో విరుష్క జోడీ సెలబ్రెషన్స్ కు తాత్కాలికంగా బ్రేక్ పడేలా కన్పిస్తోంది. సినిమాల్లో హీరోయిన్ గా బీజీగా ఉండే అనుష్క శర్మ నిర్మాతగా మారి పాతల్ లోక్ అనే వెబ్ సీరిసును నిర్మించింది. అయితే […]

Written By: Neelambaram, Updated On : May 21, 2020 7:23 pm
Follow us on


లాక్డౌన్లో విరుష్క జోడీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. నిత్యం తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెల్సిందే. వివాదాలకు దూరంగా ఉండే అనుష్క శర్మ ప్రస్తుతం ఓ వివాదంలో ఇరక్కుపోయింది. ఈమేరకు ఆమెకు లీగల్ నోటీసులు జారీకావడంతో విరుష్క జోడీ సెలబ్రెషన్స్ కు తాత్కాలికంగా బ్రేక్ పడేలా కన్పిస్తోంది. సినిమాల్లో హీరోయిన్ గా బీజీగా ఉండే అనుష్క శర్మ నిర్మాతగా మారి పాతల్ లోక్ అనే వెబ్ సీరిసును నిర్మించింది. అయితే తొలి వెబ్ సీరిసుతోనే ఆమె వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ఈ వెబ్ సీరిసులో ఓ వర్గాన్ని(కులాన్ని) తక్కువచేసి చూపించారని ఆమెకు లీగల్ నోటీసులు జారీకావడంతో ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

పాతల్ లోక్ వెబ్ సీరిస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజయింది. ఓ పోలీస్ అధికారి ఉన్నత స్థాయి దర్యాప్తులో భాగంగా అండర్ వరల్డ్ యొక్క చీకటి రాజ్యంలోకి ఎలా వెళుతుంది? అనే కోణంలో ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. ఇందులో గోర్ఖా అనే పదాన్ని కించపరిచేలా మాట్లాడారని ప్రణయ్ రాయ్ అండ్ అసోసియేషట్స్ కు చెందిన విరేన్ శ్రీ గురుంగ్ అనుష్క శర్మకు లీగల్ నోటీసులు పంపించారు. నేపాలికీ చెందిన గోర్ఖా కమ్యూనిటీని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని గోర్ఖా కమ్యూనిటీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్ట్రీకు ఆన్ లైన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవలే ఈ వెబ్ సీరిసుకు విరాట్ కోహ్లీ రివ్యూ రాసి నటీనటులకు కితాబిచ్చాడు. తాజాగా ఈ వెబ్ సీరిస్ వివాదాల్లో చిక్కుకోవడంతో అనుష్క శర్మ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. అనుష్క శర్మ ఈ వివాదాన్ని ఎలా డీల్ చేస్తారో వేచి చూడాల్సిందే..!