మిర్చి కంపెనీ లో మూడోసారి అడుగు పెడుతున్న స్వీటీ

టాలీవుడ్ లో జేజమ్మ అనుష్క క్రేజ్ అపారం. మరెవ్వరు చేరుకోలేని స్థాయి ఆమెది. గత పదిహేనేళ్లుగా తెలుగు పరిశ్రమలో చాల కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అరుంధతి చిత్రం అఖండ విజయం తరవాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇక ఇపుడు అనుష్క నటించిన హార్రర్ థ్రిల్లర్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ” నిశ్శబ్దం” త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నట్లు […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 5:13 pm
Follow us on

టాలీవుడ్ లో జేజమ్మ అనుష్క క్రేజ్ అపారం. మరెవ్వరు చేరుకోలేని స్థాయి ఆమెది. గత పదిహేనేళ్లుగా తెలుగు పరిశ్రమలో చాల కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అరుంధతి చిత్రం అఖండ విజయం తరవాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇక ఇపుడు అనుష్క నటించిన హార్రర్ థ్రిల్లర్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ” నిశ్శబ్దం” త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి

అనుష్క త్వరలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే సందీప్ కిషన్ తో ” రా రా కృష్ణయ్య” చిత్రం తీసిన దర్శకుడు మహేష్ తో కూడా మరో మూవీ చేయడానికి సుముఖత చూపినట్లు తెలుస్తోంది.

ఇక అనుష్క ప్రస్తుతం..చేస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తుంది. ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో అన్ని భాషల్లోనూ విడుదల చెయ్యాలనేది నిర్మాతల ప్లాన్. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ రెండవ తారీఖున విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా విపత్తు కారణం గా వాయిదా పడింది. అదలావుంటే అనుష్క తన తరవాతి చిత్రం ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో చేయబోతుందని తెలుస్తోంది.ఇక ఈ చిత్రాన్ని.. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ‘యూవీ క్రియేషన్స్’ లో అనుష్కకు ఇది మూడవ చిత్రం అవుతుంది. గతంలో యువీ బ్యానర్ లోఅనుష్క అలియాస్ స్వీటీ ‘మిర్చి’ ‘భాగమతి’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది.
We always need proper planning