Jai Bheem: జై భీమ్’.. సూర్య నటించి, నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. సూర్య అభిమానులను అయితే మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తెలుగు – తమిళ భాషలతో పాటు ఇతర భాషల సినీ అభిమానులను కూడా బాగా అలరించింది. అందుకే, ఈ సినిమా తాజాగా మరో క్రెడిట్ కొట్టేసింది. ఈ సినిమాలోని ఓ సీన్ ‘Scene At The Academy’ పేరుతో ఆస్కార్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది.

ఇప్పటికే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ న్యాయవాది, జస్టిస్ చంద్రు కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుందీ చిత్రం. మొత్తమ్మీద ‘జై భీమ్’ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా దేశమంతా హాట్ టాపిక్ అవడానికి కారణం.. ఈ సినిమాలో ఎమోషన్స్ అలాగే చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది.
Also Read: గాడిద.. జర్నలిస్టుకే తెలుగు నేర్పిన బాలయ్య.. వీడియో వైరల్

ఐతే, తమిళనాట మాత్రం ఈ చిత్రం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. తమిళనాడులో ‘వన్నియార్’ అనే సామాజిక వర్గం వారిని ఈ సినిమాలో కాస్త నెగిటివ్ కోణంలో చూపించారు. దాంతో ఆ వర్గం వారు తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలను పెట్టారని ఈ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రచ్చకు దిగారు. కుల సంఘం వారు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలని బాగా ఉబలాట పడ్డారు. సూర్య రంగంలోకి దిగి ఇప్పటికే క్లారిటీగా వివరణ ఇచ్చారు.
అయినా తమిళనాడులో ఇక నుంచి సూర్య చిత్రాలను బ్యాన్ చేస్తామని పీఎంకే పార్టీ బెదిరింపులకు కూడా దిగింది. అయితే,మిగిలిన తమిళ హీరోలు, పలువురు సెలబ్రిటీలు సైతం సూర్య కి మద్దతుగా నిలిచారు. అసలు ఈ సినిమా కథ నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కింది.
Also Read: ఆటో నడుపుకోవాలని హేళన చేశారు.. చేదు అనుభవంపై కన్నీళ్లు పెట్టుకున్న బౌలర్ సిరాజ్..