Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu- Trivikram: మహేష్ సినిమాలో మరో హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరింది

Mahesh Babu- Trivikram: మహేష్ సినిమాలో మరో హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరింది

Mahesh Babu- Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో నందమూరి తారక రత్న నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఐతే, ఇప్పుడు ఈ పాత్రలో మరో హీరో పేరు వినిపిస్తోంది. మాజీ హీరో వేణు, మహేష్ సినిమాలో కనిపించబోతున్నాడు.

Mahesh Babu- Trivikram
Mahesh Babu- Trivikram

వేణు పాత్ర విషయానికి వస్తే.. మహేష్ కి బావ పాత్ర అట. పైగా ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అట. ఎప్పటి నుంచో వేణు సైడ్ క్యారెక్టర్స్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. ఎలాగూ వేణు.. రవితేజ హీరోగా వస్తున్న ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కి కూడా విలువ ఉంటుంది కాబట్టి.. వేణుకి కాలం కలిసి వస్తోందేమో చూడాలి.

Also Read: Meera Jasmine: మీరా జాస్మిన్ నుంచి మళ్లీ అందాల అరాచకం.. పిక్స్ కేక

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఆగస్టు సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు. పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట.

Mahesh Babu- Trivikram
Mahesh Babu- Trivikram

ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు. సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. ఏది ఏమైనా త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు.

ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాకు రూ. 200 కోట్లు మినిమం బడ్జెట్‌ అయిపోయింది. ఎలాగూ మహేష్‌ రెమ్యునరేషన్‌ రూ. 60 కోట్లు వరకు ఉంటుంది. మరోపక్క అల వైకుంఠపురములో.., భీమ్లా నాయక్‌ తో త్రివిక్రమ్‌ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేశాడు. ఈ లెక్కన సినిమాకి రూ.250 కోట్లు కనీస బడ్జెట్ అయ్యేలా ఉంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

Also Read:KGF 3 Release Date: షాకింగ్ : ‘కేజీఎఫ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యాక్షన్ లవర్స్ కి కిక్కే కిక్కు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version