బుల్లితెర యాంకర్ శ్యామల భర్త.. నటుడు నరసింహారెడ్డిని పోలీసులు చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. అతనితోపాటో మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై యాంకర్ శ్యామల స్పందించారు. తన భర్తతోపాటు ఆమె గురించి కూడా మాట్లాడారు.
నరసింహారెడ్డి తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడని, తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 2017 నుంచి పలుమార్లు డబ్బు తీసుకున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తమ మధ్య ఓ మహిళ రాయభారం కూడా నడిపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.
ఈ విషయంపై యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడారు. తన భర్త ఎలాంటి వాడో తనకు బాగా తెలుసునని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. డబ్బుల కోసం ఓ మహిళను మోసం వ్యక్తిత్వం తన భర్తది కాదని అన్నారు. తమ ఇద్దరికి వివాహమై పదేళ్లు దాటిందని, డబ్బులకోసం ఆశపడేవాడైతే ఒక్కసారైనా బయటపడేవాడని చెప్పింది. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని ఆరోపించింది శ్యామల.
అసలు ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో, అరెస్టు అయిన మహిళ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. అంతేకాదు.. ఈ గొడవ చాలా కాలంగా సాగుతోందని చెబుతున్నారని.. తనకు మాత్రం ఇప్పటి వరకు తెలియదని చెప్పింది. ఈ విషయమై తన భర్తతో మాట్లాడుతానని, అన్ని విషయాలూ తెలుసుకున్న తర్వాత తానే మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తానని చెప్పారు.