Anchor Anasuya: కేటీఆర్‌ సర్‌ ఇదెక్కడి న్యాయం చెప్పండి అంటున్న అనసూయ …

Anchor Anasuya: చిన్నారుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు అనుసరిస్తోన్న తీరుపై నటి, ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ అసహనం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్‌ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ తాజాగా ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. క‌రోనా లాక్ డౌన్ త‌ర‌వాత స్కూళ్లు తెరుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే పిల్ల‌ల‌కు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 29, 2021 5:23 pm
Follow us on

Anchor Anasuya: చిన్నారుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు అనుసరిస్తోన్న తీరుపై నటి, ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ అసహనం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్‌ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ తాజాగా ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

క‌రోనా లాక్ డౌన్ త‌ర‌వాత స్కూళ్లు తెరుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే పిల్ల‌ల‌కు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ ఇవ్వ‌డం మొద‌లు పెట్ట‌లేదు. దాంతో త‌ల్లిదండ్ర‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఈ విష‌య‌మై అన‌సూన కేటీఆర్ ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించింది. కేటీఆర్ సార్.. అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చిందని… అన్‌లాక్‌ ఎందుకు చేశారు అనేది అర్థం చేసుకోవాలి. మనందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నామని కాస్త భరోసా ఇచ్చారని పేర్కొంది. మరి టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? అంటూ అన‌సూయ కేటీఆర్ ను ప్ర‌శ్నించింది.

 

వాళ్ళను స్కూల్స్ కు పంపించాల‌ని యాజమాన్యాలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి.? అంటూ నిల‌దీసింది. అంతే కాకుండా పిల్లలు స్కూల్‌లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే తమ బాధ్యత కాద‌ని పేర్కొంటూ పేపర్‌పై యాజ‌మాన్యాలు సంతకం కూడా చేయించుకుంటున్నాయని అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చెప్పండి.. ఇదెక్కడి న్యాయం.. ఇది ఎంతవరకు సమంజసం. ఎప్పటిలాగే మీరు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నా…అంటూ అన‌సూయ కేటీఆర్ ను సూటిగా ప్ర‌శ్నించింది. మ‌రి అన‌సూయ ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ ఎలా స‌మాధానం ఇస్తారా చూడాలి.