
బ్రహ్మాజీ కుమారుడు విశ్వనాథ్ నటించిన “ఓ పిట్టకథ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు . ఈ ఈవెంట్ లో అనసూయను ఉద్దేశించి చిరంజీవి “రంగమ్మత్త గెస్ట్గా వచ్చినందుకు సంతోషం. మొన్న టెస్ట్ చేయించుకున్నాను.. నా గుండె చాలా స్ట్రాంగ్గా ఉందని అన్నారు. కానీ, ఇప్పుడు ఎందుకో చాలా పెయిన్ వచ్చింది అర్థం కావట్లే.. కొంచెం చిన్న వాయిస్ తో రామ్ చరణ్కి చెప్పకమ్మా!” అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారందరిని నవ్వులలో ముంచెత్తింది.
దీని గురించి అనసూయ ట్వీట్ చేస్తూ “హాహాహా… చాలా క్యూట్.. చాలా వినయం.. మెగా లెజెండ్ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది” అని మెగాస్టార్ పొగడ్తలతో ముంచెత్తింది . ఎప్పటికి తాను చిరంజీవి ఫ్యాన్ అంటూ ఒక హాష్ ట్యాగ్ కూడా జోడించింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొడుతుంది.