Anand Deverakonda: అనసూయతో అన్నయ్య గొడవకు కారణం అదే… ఓపెన్ అయిన ఆనంద్ దేవరకొండ

విజయ్ ఫ్యాన్స్ లో ఆగ్రహాన్ని రగిలించింది. అనసూయ మీద విరుచుకుపడ్డారు. ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అనసూయ కూడా తగ్గలేదు. వాళ్లకు తిరిగి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసింది. కొందరిపై సైబర్ కేసులు కూడా పెట్టింది. ఇటీవల మరోసారి విజయ్ దేవరకొండను ఆమె రెచ్చగొట్టారు. ఖుషి చిత్ర పోస్టర్స్ లో ది విజయ్ దేవరకొండ అని పెట్టడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. పైత్యం పరాకాష్టకు చేరిందని పరోక్షంగా విజయ్ దేవరకొండపై ట్వీట్ వేసింది. ఈ వివాదం చాలా రోజులు నడిచింది.

Written By: Shiva, Updated On : July 13, 2023 4:18 pm

Anand Deverakonda

Follow us on

Anand Deverakonda: విజయ్ దేవరకొండ-అనసూయ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి మూవీలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ ని అనసూయ తీవ్రంగా తప్పుబట్టింది. 2017లో ఈ రచ్చ జరగ్గా సద్దుమణిగింది. తర్వాత దేవరకొండ ప్రొడక్షన్ లో అనసూయ పని చేసింది. తరుణ్ భాస్కర్, అభినవ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా చిత్రంలో అనసూయ కీలక రోల్ చేశారు. అంతగా బాగుంది అనుకుంటున్న సమయంలో అనసూయ విజయ్ దేవరకొండను మరలా గెలికింది. లైగర్ మూవీ ఫలితం మీద సెటైర్ వేసింది. మూవీ ప్లాప్ అయినందుకు ఆనంద పడుతున్నట్లు ఆమె ట్వీట్ ఉంది.

ఇది విజయ్ ఫ్యాన్స్ లో ఆగ్రహాన్ని రగిలించింది. అనసూయ మీద విరుచుకుపడ్డారు. ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అనసూయ కూడా తగ్గలేదు. వాళ్లకు తిరిగి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసింది. కొందరిపై సైబర్ కేసులు కూడా పెట్టింది. ఇటీవల మరోసారి విజయ్ దేవరకొండను ఆమె రెచ్చగొట్టారు. ఖుషి చిత్ర పోస్టర్స్ లో ది విజయ్ దేవరకొండ అని పెట్టడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. పైత్యం పరాకాష్టకు చేరిందని పరోక్షంగా విజయ్ దేవరకొండపై ట్వీట్ వేసింది. ఈ వివాదం చాలా రోజులు నడిచింది.

విజయ్ దేవరకొండతో గొడవలు పడ్డ అనసూయ ఆనంద్ దేవరకొండ పట్ల అభిమానం చూపుతుంది. ఆయన లేటెస్ట్ మూవీ బేబీకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసలు కురిపించింది. అన్నయ్యతో వైరం అంటున్న అనసూయ దేవరకొండను సప్పోర్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో విజయ్-అనసూయ గొడవకు కారణాలు ఏంటో చెప్పాలని విజయ్ దేవరకొండను అడిగారు. ‘అన్నయ్యతో అనసూయ గొడవ గురించి పూర్తిగా తెలియదు. నాకు కొంత వరకే తెలుసు. నా అభిప్రాయంలో ఇది వన్ సైడ్ కామెంట్రీ. వాళ్ళిద్దరికీ ఎలాంటి గొడవలు లేవు. ఈ వివాదంలో అంతకంటే లోతుకి నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను, అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మనస్పర్థలకు కోపాలు ద్వేషాలకు సోషల్ మీడియానే కారణం. నేరుగా ఒక వ్యక్తిపై మరొక కామెంట్స్ చేయలేరు. సోషల్ మీడియాలో ఈజీగా చేసేస్తారు. సోషల్ మీడియా మానసికంగా మనల్ని దెబ్బ తీస్తుంది. అయినా తెలియకుండా మనం అందులో భాగమైపోయాము, అన్నారు. గతంలో అనసూయ విజయ్ దేవరకొండను తాను టార్గెట్ చేయడం వెనుక కారణం ఉందని చెప్పారు. విజయ్ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్నాడని తెలిసింది. ఆ విషయం నన్ను బాధపెట్టిందని అనసూయ చెప్పుకొచ్చారు.