Allu Arjun Politics: తమిళనాడులో విజయ్ ముఖ్య మంత్రి అయ్యాక , అనేక మంది హీరోల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆశ పుట్టిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. విజయ్ కి జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది , అంతే కాకుండా ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడిమరీ చూస్తుంటారు. దశాబ్దాల నుండి సంపాదించుకున్న క్రెడిబిలిటీ ఇది. 2008 లోనే దూరదృష్టితో తన రాజకీయ రంగ ప్రవేశం కోసం తన ఫ్యాన్స్ అస్సోసియేషన్స్ అన్నిటిని ఒక తాటిపై తీసుకొచ్చి, వాళ్ళ చేత సేవా కార్యక్రమాలు చేయిస్తూ జనాలకు బాగా దగ్గర చేశారు విజయ్. సరైన సమయం చూసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు , పోటీ చేసిన మొదటిసారే ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. విజయ్ అనుసరించిన ఈ మోడల్ అల్లు అర్జున్ కి తెగ నచ్చేసింది. అందుకే ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని వైపుల నుండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు లేటెస్ట్ గా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అవును.. మీరు వింటున్నది నిజమే.. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు , అందుకోసం ఆయన రెగ్యులర్ గా ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. ఆయన మామయ్య చంద్ర శేఖర్ కూడా తనవైపు నుండి పూర్తి సహకారం అందిస్తున్నారట. అయితే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ 2029 లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కి రాజకీయ పార్టీ ని స్థాపించేంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ , చరిష్మా కానీ లేదు. పుష్ప కారణం గా జెన్ జీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంది కానీ , అది ఓట్లు వేసేంత రేంజ్ కాదు. అందుకే అల్లు అర్జున్ చాలా పకడ్బందీగా విజయ్ మోడల్ ని అనుసరిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన అభిమాన సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రతీ నెల వాళ్లకు ఫండింగ్ కూడా అల్లు అర్జున్ వైపు నుండి అందుతుంది. ఈ అభిమాన సంఘాల ద్వారా ఆయన సేవా కార్యక్రమాలు చేయించే ప్లాన్ లో ఉన్నారు , ఇప్పటికే కొంతమంది కి ఆయన ఈ అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు చేయించారు. ఇలా సుదీర్ఘంగా ఒక దశాబ్దం పాటు చేసి , ఈ లోపు మంచి కాంబినేషన్స్ తో సినిమాలను సెట్ చేసుకొని, భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని , అన్ని వర్గాల్లోనూ ఫ్యాన్ బేస్ ని పెంచుకొని , పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?, లేదా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అనేది చూడాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
