Allu Arjun: విలువల కోసం పది కోట్లు వదిలేసిన అల్లు అర్జున్… ఇంతకీ ఏం జరిగింది?

పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ ఫేమ్ ఎల్లలు దాటేసింది. సౌత్ నుండి ఇమేజ్ నార్త్ కి పాకింది. అల్లు అర్జున్ కి హిందీ సర్కిల్ కూడా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Written By: NARESH, Updated On : December 16, 2023 1:03 pm

Allu Arjun

Follow us on

Allu Arjun: స్టార్ హీరో అంటే చాలా మందికి రోల్ మోడల్. వాళ్ళు చేసే పనుల్ని అభిమానులు గుడ్డిగా ఫాలో అవుతారు. డ్రెస్సింగ్, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టయిల్ ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. కోట్ల మందికి స్ఫూర్తిగా ఉన్న హీరోలు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అభిమానులు, సమాజానికి చేటు కలిగించే పనులకు దూరంగా ఉండాలి. అల్లు అర్జున్ ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. సోషల్ వాల్యూస్ కోసం ఆయన కోట్లు రూపాయలు వదులుకున్నారన్న ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ ఫేమ్ ఎల్లలు దాటేసింది. సౌత్ నుండి ఇమేజ్ నార్త్ కి పాకింది. అల్లు అర్జున్ కి హిందీ సర్కిల్ కూడా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి పాపులారిటీ ఉన్న హీరో వెనుక కార్పొరేట్ కంపెనీలు పడటం చాలా సహజం. ఇప్పటికే పలు బ్రాండ్స్ ని అల్లు అర్జున్ ప్రోమోట్ చేస్తున్నారు. ఫుడ్, ట్రావెల్, బేవరేజ్ సంస్థల వ్యాపార ప్రకటనల్లో అల్లు అర్జున్ నటిస్తున్నాడు.

కాగా ఆయనకు ఓ ఆల్కహాల్ బ్రాండ్ నుండి భారీ ఆఫర్ వచ్చిందట. తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రూ. 10 కోట్లు ఆఫర్ చేశారట. ఇది రెగ్యులర్ బ్రాండ్స ప్రమోషన్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువని చెప్పొచ్చు. అయినా అల్లు అర్జున్ సున్నితంగా తిరస్కరించారట. ప్రజారోగ్యానికి హాని కలిగించే ప్రొడక్ట్స్ ని నేను ప్రమోట్ చేయనని ఖరాఖండిగా చెప్పాడట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

పాన్ మసాలా యాడ్ లో నటించిన అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్, షారుఖ్ ఖాన్ లను న్యాయస్థానం మందలించింది. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అల్లు అర్జున్ వంటి హీరోలు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది.